బిట్​ బ్యాంక్​ : శాతవాహన వంశ స్థాపకుడు ఎవరు ?

బిట్​ బ్యాంక్​ :  శాతవాహన వంశ స్థాపకుడు ఎవరు ?
  • శాతవాహనుల జన్మభూమి కర్ణాటక ప్రాంతమని డాక్టర్​ సుక్తాంకర్​ అభిప్రాయపడ్డారు. 
  • శాతవాహనుల జన్మభూమి విదర్భ అని వి.వి.మిరాసి అభిప్రాయపడ్డారు. 
  • శాతవాహనుల తొలి ప్రాంతం మహారాష్ట్ర అని పి.టి.శ్రీనివాస్​ అభిప్రాయపడ్డారు. 
  • శాతవాహనుల మూలస్థానం పైఠాన్​ ప్రాంతమని డాక్టర్​ కె.గోపాలచారి పేర్కొన్నారు. 
  • శాతవాహనులు ఆంధ్రులు కారని, ఆంధ్రులకు భృత్యువులని డాక్టర్​ కె.గోపాలచారి వాదించారు. 
  • ఏటూరి బలరామమూర్తి ప్రకారం కరీంనగర్​ జిల్లాలోని మహానగర శిథిలాలు కదంబపూర్​లో బయల్పడ్డాయి. 
  • వాయుపురాణం ప్రకారం 15 మంది శాతవాహన రాజులు పాలించారు. 
  • మత్స్య పురాణం ప్రకారం 30 మంది శాతవాహన రాజులు పాలించారు. 
  • నాణేలపై కనిపిస్తున్న తొలి శాతవాహన రాజు గోబద.
  • శాతవాహన వంశ స్థాపకుడు, మొదటి రాజు శ్రీముఖుడు. 
  • సాతవాహనుడే శ్రీముఖడని, ఇతడే శాతవాహన వంశ మూలపురుషుడని, తొలి రాజు అని నాణేల ఆధారంగా పరిశోధకుడు డాక్టర్​ డి.రాజారెడ్డి పేర్కొన్నారు. 
  • శ్రీముఖుడు తొలుత జైనమతం అవలంబించారు. జైన గురువు కాలకసూరి.
  • పుష్యమిత్ర శుంగుడు ఉత్తర భారతదేశంలో మౌర్య వంశాన్ని నిర్మూలించి మగధలో శుంగ వంశాన్ని స్థాపించే సమయంలో మొదటి శాతకర్ణి పాలన కొనసాగిస్తున్నారు. 
  • రాప్సన్​, బారువా అనే చరిత్రకారులు వైన్​గంగా నదిని కణ్ణబెణ్నా నది అని అన్నారు. 
  • నానాఘాట్​ శాసనం దేవి నాగానిక వేయించారు. ఈ శాసనంలో మొదటిశాతకర్ణిని దక్షిణాపథపతి అని వర్ణించారు. 
  • మొదటిసారిగా వైవాహిక సంబంధాల ద్వారా మొదటి శాతకర్ణి రాజ్యాన్ని విస్తరించారు. 
  • మొదటి శాతకర్ణి ఖారవేలునిపై దండెత్తి, ఓడించి తన రాజ్యాన్ని తూర్పుదిశకు విస్తరించాడని చుళ్లకలింగ జాతకం తెలుపుతుంది. 
  • శాతవాహనుల్లో మొదటిసారిగా మొదటి శాతకర్ణి యాగాలు చేశాడు. 
  • మొదటి శాతకర్ణికి అస్మాకదీశ, అప్రహతిచక్ర, దక్షిణపథాపతి అనే బిరుదులు ఉన్నాయి. 
  • దేవి నాగానికి బిరుదులు యజ్ఞ హుతన సుంగదయా, దిగవ్రత సుంధయ. 
  • వేదసిరిని పూర్ణోత్సంగుడు అని కూడా అంటారు. 
  • రెండో శాతకర్ణి మగధ, కళింగలను కూడా ఆక్రమించి పాలన సాగించాడని యుగపురాణంలో ఉంది. 
  • సాంచీస్థూప దక్షిణద్వారంపై శాసనాన్ని చెక్కించిన వాసిష్టిపుత్ర ఆనందుడు రెండో శాతకర్ణి ఆస్థానంలోని వాడు. 
  • సాంచీ స్థూపానికి దక్షిణ తోరణాన్ని రెండో శాతకర్ణి నిర్మించారు. 
  • లంబోదరుడి కాలంలో శక, యవన, కళింగ, పహ్లవాదులు శాతవాహన రాజ్య భాగాలను ఆక్రమించారు. 
  • బృహత్కథ, వాత్స్యాయన కామసూత్రాలు, కావ్య మీమాంసల్లో కుంతల శాతకర్ణి ప్రశంస కనిపిస్తుంది. 
  • శర్వవర్మ, గుణాఢ్యుడు కుంత శాతకర్ణి ఆస్థానంలోని వారు. 
  • ప్రాకృతభాష స్థానంలో సంస్కృత భాషను రాజభాషగా కుంతల శాతకర్ణి ప్రకటించారు. 
  • హాలుడు కూర్చిన గ్రంథం గాథా సప్తశతి. 
  • శ్రీలంక రాకుమారి లీలావతిని హాలుడు పెళ్లి చేసుకున్నాడు. 
  • త్రిసముద్ర తోయ పీతవాహనుడు అని బిరుదు గలరాజు గౌతమీపుత్ర శాతకర్ణి. 
  • గౌతమీపుత్ర శాతకర్ణి కాలంలో ఆంధ్రప్రదేశ్​ మొత్తం శాతవాహనుల ఆధీనంలోకి వచ్చింది. 
  • గౌతమీబాలశ్రీ  నాసిక్​ శాసనం వేయించారు.
  • గౌతమీపుత్ర శాతకర్ణి నాణేలు కొండాపూర్​, పెద్దబంకూర్​, జోగల్​తంబీ వద్ద లభించాయి. 
  • నహపానుడిపై విజయం సాధించి అతని నాణేలపై తన పేరుతో నాణేలు పునర్ముద్రించిన శాతవాహన రాజు గౌతమీపుత్ర శాతకర్ణి. 
  • క్రీ.శ.78వ సంవత్సరాన్ని శాలివాహన శకంగా ప్రకటించిన వారు గౌతమీపుత్ర శాతకర్ణి. 
  • రాజ్యంలో బ్రాహ్మణాధిక్యతను ప్రవేశపెట్టి చాతుర్వర్ణ వ్యవస్థను బలోపేతం చేసిన శాతవాహన రాజు గౌతమీపుత్ర శాతకర్ణి. 
  • రాజ్యంలో బ్రాహ్మణులకు అగ్రహారాలు ఇచ్చే పద్ధతిని ప్రవేశ పెట్టిన శాతవాహన రాజు మొదటి శాతకర్ణి. 
  • ధాన్యకటకాన్ని రాజధానిగా చేసుకొని గౌతమీపుత్ర శాతకర్ణి పరిపాలించారు.