న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎప్పటికైనా ఓడిపోతుందని ప్రతిపక్ష పార్టీలు నమ్మాలని మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం చెప్పారు. అందుకు తొలి అడుగు బిహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచే మొదలవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 2019 లోక్సభ ఎన్నికల తర్వాత నుంచి బీజేపీ గెలుపు శాతం క్రమంగా తగ్గుతోందన్నారు.
2019 के बाद से इन क्षेत्रों के चुनावों या उप-चुनावों में, भाजपा उम्मीदवारों ने 381 में से केवल 163 में ही जीत हासिल की।
किसने कहा कि भाजपा को हराया नहीं जा सकता है? विपक्षी दलों को यह विश्वास करना होगा कि वे भाजपा को हरा सकते हैं।
मुझे उम्मीद है कि यह बिहार में साबित होगा।— P. Chidambaram (@PChidambaram_IN) November 1, 2020
‘2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు 381 లోక్ సభ స్థానాల్లో 319 చోట్ల విజయం సాధించారు. అవే నియోజకవర్గాల్లో గత ఏడాదిన్నర కాలంలో జరిగిన సాధారణ, ఉప ఎన్నికల్లో కేవలం 163 స్థానాల్లో మాత్రమే బీజేపీ గెలిచింది. బీజేపీని ఓడించలేమని ఎవరు చెప్పారు? బీజేపీని ఓడించగలమని విపక్ష పార్టీలు నమ్మాలి. ఇది బిహార్ నుంచే మొదలవుతుందని నేను ఆశిస్తున్నా’ అని చిదంబరం ట్వీట్ చేశారు. బిహార్లో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీలు కలసి రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నాయకత్వంలో మహాగట్బంధన్ కూటమిని ఏర్పాటు చేశాయి.