దేశం మొత్తం CAA కు వ్యతిరేకంగా ఉంది : గులాంనబీ ఆజాద్

దేశం మొత్తం CAA కు వ్యతిరేకంగా ఉంది : గులాంనబీ ఆజాద్

పౌరసత్వ సవరణ బిల్లుకు దేశం మొత్తం వ్యతిరేకంగానే ఉందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ తెలిపారు. CAA దేశం మొత్తంగా ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇంత పెద్ద మొత్తంలో నిరసనలు, ఆందోళనలు ఇప్పటి వరకూ ఎప్పుడూ చూడలేదన్నారు. ఈ నిరసనల్లో దేశంలోని అన్ని వర్గాల ప్రజలూ భాగమయ్యారని, అటు పార్లమెంటులో కూడా ప్రతిపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకించాయన్నారు గులాంనబీ ఆజాద్. బిల్లుకు మద్దతిచ్చిన ఐదు ప్రాంతీయ పార్టీలు కూడా ఇప్పుడు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు.