ఇది గుర్తు పెట్టుకోండి.. బెంగాల్‌‌లో బీజేపీ డబుల్ డిజిట్ కూడా దాటదు

ఇది గుర్తు పెట్టుకోండి.. బెంగాల్‌‌లో బీజేపీ డబుల్ డిజిట్ కూడా దాటదు
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది వెస్ట్ బెంగాల్‌‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల కోసం ఇప్పటినుంచే అన్ని పార్టీలు కసరత్తులు ప్రారంభించాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్‌‌ను మట్టికరిపించాలని బీజేపీ వ్యూహాలు పన్నుతోంది. టీఎంసీకి బీజేపీ గట్టి పోటీనిచ్చే అవకాశాలు ఉన్నాయని, గెలిచినా ఆశ్చర్యం లేదని కొన్ని మీడియా సంస్థలు అంచనా వేస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, జేడీయూ నేత ప్రశాంత్ కిషోర్ స్పందించారు. బెంగాల్‌‌లో బీజేపీ డబుల్ డిజిట్ కూడా దాటలేదన్నారు. For all the hype AMPLIFIED by a section of supportive media, in reality BJP will struggle to CROSS DOUBLE DIGITS in #WestBengal PS: Please save this tweet and if BJP does any better I must quit this space! — Prashant Kishor (@PrashantKishor) December 21, 2020 ‘అనుకూల మీడియా బాగా ప్రచారం చేస్తోంది, కానీ బెంగాల్‌‌లో బీజేపీ రెండు అంకెల సీట్లను దాటడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతుంది. దయచేసి ఈ ట్వీట్‌‌ను సేవ్ చేస్తోండి. ఒకవేళ నేను చెప్పినదాని కంటే బీజేపీ మెరుగ్గా రాణిస్తే నేను వైదొలుగుతా’ అని ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేశారు. ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) అనే సంస్థకు ప్రశాంత్ అధినేత అన్న విషయం విధితమే. రాజకీయ పార్టీల గెలపోటములకు కావాల్సిన సహకారాలను ఈ సంస్థ అందిస్తుంది. 2011లో గుజరాత్ సీఎంగా మోడీ గెలుపులోనూ, 2014గా ఆయన ప్రధాని పీఠం ఎక్కడంలోనూ ఐప్యాక్ కృషి చేసింది. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలోనూ ఐప్యాక్ ప్రభావవంతంగా సేవలు అందించింది.