మమతా బెనర్జీని చిత్తుగా ఓడిస్తా

మమతా బెనర్జీని చిత్తుగా ఓడిస్తా
కోల్‌‌కతా: రాబోయే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ అన్నారు. తృణమూల్ రూలింగ్‌‌లో ఉంటే హింసాత్మక రాజకీయం కొనసాగుతుందని, బెంగాల్‌‌లో తాము మార్పు తీసుకురాబోతున్నామని చెప్పారు. లోక్‌‌ సభ ఎన్నికల్లో త‌ృణమూల్ కాంగ్రెస్‌‌ను సగం స్థానాలకు పరిమితం చేశామని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని పూర్తిగా ఓడిస్తామని స్పష్టం చేశారు. వెస్ట్ బెంగాల్‌‌లో ఏప్రిల్-మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపిక తదితర వ్యూహాలను ఇప్పటి నుంచే పదును పెడుతున్నాయి. স্বাগতম দিদি। ২১ বছর সঙ্গে ছিলাম। এবার‌ নন্দীগ্রামে সামনা-সামনি দেখা হবে।Welcome Didi! For 21 yrs I was by ur side. Now I look forward to the face-to-face fight in #Nandigram!स्वागतम् दीदी। २१ साल आपके साथ खड़ा था। इस बार नंदीग्राम में आमने-सामने मुलाक़ात होगी। इंतज़ार रहेगा।— Suvendu Adhikari • শুভেন্দু অধিকারী (@SuvenduWB) January 18, 2021 ఎన్నికలకు కొన్ని నెలల సమయమే మిగిలి ఉన్న నేపథ్యంలో సువేందు అధికారి లాంటి తృణమూల్ కీలక నేతలు మరికొందరిని కలుపుకొని బీజేపీలో చేరడం సంచలనంగా మారింది. నందిగ్రామ్ స్థానం నుంచి పోటీ చేయబోతున్న సీఎం మమతా బెనర్జీని కచ్చితంగా ఓడిస్తానని లేదా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సువేందు సవాల్ విసిరారు. 21 ఏళ్లు దీదీకి తాను అండగా ఉన్నానని, కానీ ఇప్పుడు నందిగ్రామ్‌‌లో ముఖాముఖి యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు ట్వీట్ చేశారు.