తెలంగాణలో ఇవాళ ఒక్కరోజే 30 మంది మృతి

తెలంగాణలో ఇవాళ ఒక్కరోజే 30 మంది మృతి
  • కొనసాగుతున్న కరోనా స్వైర విహారం

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా స్వైర విహారం కొనసాగుతోంది. లాక్ డౌన్ ఆంక్షలు అమలు చేస్తున్నా కేసుల ఉధృతితోపాటు మరణాలు ఏ మాత్రం తగ్గడం లేదు. గడచిన 24 గంటల్లో 30 మంది కరోనా నుంచి కోలుకోలేక కన్నుమూశారు. మొత్తం 62వేల 591 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 3 వేల 961 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల 559 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ కాగా 30 మంది కరోనా నుంచి కోలుకోలేక కన్నుమూశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 49 వేల 341 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా మరణాల రేటు 1.1 శాతం ఉండగా తెలంగాణలో 0.56 శాతం నమోదు అయింది. అలాగే కరోనా నుంచి కోలుకున్న వారి శాతం దేశ వ్యాప్తంగా 84.8 శాతం ఉండా తెలంగాణలో 90.17 శాతం నమోదు అయింది.