
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే వారం అమెరికా ,ఇరాన్ అధికారుల మధ్య చర్చలు జరుగుతాయని ప్రకటించారు.ఈ చర్చలలో ఇరాన్ అణు కార్యక్రమంపై ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్నారు ట్రంప్.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఇటీవల జరిగిన ఘర్షణల తర్వాత కాల్పుల విరమణ అమలులోకి వచ్చిన క్రమంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. US దాడులు ఇరాన్ అణు కార్యక్రమాన్ని దెబ్బతీశాయన్నారు ట్రంప్. అయితే ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పునరుద్దరించే ప్రయత్నం చేస్తే తిరిగి దాడులు చేస్తామని హెచ్చరించారు.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జూన్ 13న ప్రారంభమైన యుద్దం 12 రోజుల తర్వాత ముగిసింది. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య శాంతి చర్చలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని,అమెరికా ,ఇరాన్ అధికారులు వచ్చే వారం చర్చలు జరపనున్నట్లు బుధవారం(జూన్25) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించడంలో పాత్ర పోషించిన ట్రంప్, బుధవారం నాటో శిఖరాగ్ర సమావేశం ముగింపుసందర్భంగా మీడియా సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
ALSO READ | అవన్నీ ఫేక్ న్యూస్.. ఇరాన్ అణు స్థావరాలు పూర్తిగా నాశనం చేశాం: ట్రంప్
ఇరాన్ అణు కేంద్రాలపై దాడిని ప్రస్తావించిన ట్రంప్.. అమెరికా బలగాలుజరిపిన దాడుల్లో ఇరాన్ లోని నటాంజ్, ఇస్ఫహాన్, ఫోర్డోలోని ఇరాన్ అణుకేంద్రాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి..ఇకపై ఇరాన్ అణుబాంబుల ఒప్పందాన్ని ఉల్లంఘించదన్నారు.
ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత ఇరాన్ ,ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు కనిపించడంతో ఈ ప్రకటన వచ్చింది. ఓవైపు ఇరాన్ తన అణ్వాయుధ ఆశయాలను వదులుకోబోమని నొక్కి చెబుతుండగా ఈ కాల్పుల విరమణ శాశ్వత శాంతి కోసం ఆశావాదాన్ని రేకెత్తించింది.
అయితే అమెరికాతో వచ్చే వారం చర్చలు జరుగుతాయని ఇరాన్ ఇప్పటివరకు ధృవీకరించలేదు. ఇరు దేశాల మధ్య ప్రత్యక్షంగా,పరోక్షంగా చర్చలు జరుగుతున్నాయని US మిడిల్ ఈస్ట్ రాయబారి స్టీవ్ విట్కాఫ్ తెలిపారు.