చిట్టీల పేరుతో మహిళ మోసం: 70మంది ఫిర్యాదు

చిట్టీల పేరుతో మహిళ మోసం: 70మంది ఫిర్యాదు

హైదరాబాద్: చిట్టీల పేరుతో ఓ మహిళ రూ.కోట్లు మోసం చేసింది. ఈ సంఘటన హయత్‌ నగర్‌ లో జరిగింది. ప్రగతి నగర్‌ కు చెందిన పూలమ్మ అనే మహిళ చిట్టీల వ్యాపారం మొదలు పెట్టింది. పాట పాడిన వారికి డబ్బులు ఇవ్వకుండా అధిక వడ్డీ ఇస్తానంటూ డబ్బులు తన వద్దే ఉంచుకునేది. పెద్ద మొత్తంలో అందరినీ నమ్మించి రూ.4.5కోట్లు డబ్బులు వసూలు చేసింది. పత్తాలేకుండా పారిపోయింది. విషయం తెలుసుకున్న బాధితులు ఆందోళనకు గురయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. 25ఏళ్లుగా కాలనీలోనే ఉంటూ నమ్మించి చిట్టీల వేయించుకుని వడ్డీకి డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వకపోవడంతో మోసపోయామని తెలుసుకున్నారు 70 మంది బాధితులు. కేసు నమోదు చేసుకున్న హయత్‌ నగర్‌ పోలీసులు విచారణ చేపట్టారు. 70మంది బాధితులు ఒక్కసారిగా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.