రోడ్డుపై కల్లు మత్తులో మహిళ : గుక్కపట్టి ఏడుస్తున్న చిన్నారి

రోడ్డుపై కల్లు మత్తులో మహిళ : గుక్కపట్టి ఏడుస్తున్న చిన్నారి

రంగారెడ్డి జిల్లా :  కొత్తూరు మండల కేంద్రంలో ఓ మహిళా కల్లు మత్తులో నడి రోడ్డులో స్పృహ కోల్పోయి పడి ఉంది. పక్కనే చిన్నారి తల్లిపై పడి ఏడుస్తున్నాడు. అభం శుభం తెలియని చిన్నారి శోకం చూసేవారికి ఎం జరిగిందో తెలియక వేడుక చూస్తున్నారు. కల్లు దుకాణంలో కల్లు సేవించి స్పృహ కోల్పోయిన మహిళను కల్లు కాంపౌండ్ నుండి బయట రోడ్డుపై పదేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కల్లులో మందు ఎక్కువ కలుపుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు స్పందించి చర్యలు తీసుకోవాలని కొత్తూరు మండల ప్రజలు కోరుతున్నారు..