పిల్లలు కావట్లేదని.. బాలుడిని బిల్డింగ్ పై నుంచి విసిరేసిన మహిళ

పిల్లలు కావట్లేదని.. బాలుడిని బిల్డింగ్ పై నుంచి విసిరేసిన మహిళ

హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. తనకు పిల్లలు కావడం లేదనే అక్కసుతో  మూడేళ్ల బాలుడిని బిల్డింగ్ పై నుంచి విసిరేసింది ఓ మహిళ. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. పాతబస్తీ భవాని నగర్ పోలిస్ స్టేషన్ పరిధిలోని ఈది బజార్ కుమ్మర్వాడీ ప్రాంతంలో ఐషా, అహ్మద్ ఉద్దీన్ లకు వివాహం ఏడాది అయినా పిల్లలు కాలేదు. దీంతో  తనకు పిల్లలు కలగడం లేదని తన భర్త తమ్ముడి కుమారుడైన నుమాన్ ఉద్దీన్(3) ను రెండు అంతస్తుల భవనం పై నుండి కిందకు విసిరేసి చంపేసింది.  ఐష.. మృతి చెందిన బాబుకు పెద్దమ్మ. చిన్నారి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఐషను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని చెప్పారు.