డీఎస్పీ ఆఫీస్ ముందు మహిళ ఆత్మహత్యాయత్నం

డీఎస్పీ ఆఫీస్ ముందు మహిళ ఆత్మహత్యాయత్నం

వికారాబాద్ జిల్లా తాండూర్ లో దారుణం జరిగింది. డీఎస్పీ కార్యాలయం ముందు  రేణుక అనే మహిళ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గ్రామంలో తనను తన పిల్లలను కొందరు వ్యక్తులు కులం పేరుతో దూషించడమే గాకుండా.. తన పొలంను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని రేణుక ఆరోపించింది. పోలీసులు పట్టించుకోకపోవడంతో తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు చెప్పింది.  తన భర్త  సిఐ రాజయ్య నిజామాబాద్ లో పని చేస్తాడని ..అయినా తమకు రక్షణ లేదని పోలీసులకు తమకు న్యాయం చేయాలని కోరింది. రేణుకను చికిత్స నిమిత్తం రేణుకను జిల్లా ఆస్పత్రికి తరలించారు.