కవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టోరీ : సముద్రమంత  ప్లాస్టిక్​

కవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టోరీ : సముద్రమంత  ప్లాస్టిక్​

తినే తిండి.. తాగే నీళ్లు.. వాడుకునే వస్తువులు.. ప్రతి దానికీ ప్లాస్టిక్! మన కండ్ల ఎదురుగా కనిపించే ప్రతి వస్తువులో ప్లాస్టిక్. అంతలా మన జీవితంలో ప్లాస్టిక్ భాగమైపోయింది. అవసరం ఉన్నా లేకున్నా వాడాల్సిన పరిస్థితికి మనం చేరిపోయాం. ప్లాస్టిక్ వస్తూనే ఉన్నది.. గుట్టలు గుట్టలుగా పేరుకుపోతూనే ఉన్నది. భూమినే కాదు.. సముద్రాలను ముంచెత్తుతున్నది. ఎన్నో జీవరాశుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నది. ప్లాస్టిక్ భూతం వల్ల సముద్రాలకు, జలచరాలకు జరుగుతున్న నష్టమెంత? ప్లాస్టిక్​ను ఆపేదెట్ల? సముద్రాలను కాపాడుకునుడెట్ల? 

‘మనిషి కంట పడని ప్రతి చోటు అద్భుతమే.


మనిషి అడుగుపడనంత వరకే ఏ ప్రాంతమైనా సురక్షితం’ అని అన్నాడో రచయిత. దేన్నయినా ధ్వంసం చేయగల ‘నేర్పు’.. గాలినీ.. గంగనూ.. కలుషితం చేయగల తెలివి.. ఒక్క మనిషికే సొంతం. మన తప్పులకు నీటి అడుగున ఉన్న ప్రపంచం నాశనం అవుతోంది. ప్లాస్టిక్ చెత్తను పడేసేందుకు డంపింగ్ యార్డుల్లా సముద్రాలు మారిపోతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిపోతున్నాయి. సముద్రపు జీవుల మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని అమెరికాకు చెందిన ‘ది 5 గైర్స్ ఇని​స్టిట్యూట్’ ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహా సముద్రాల్లో దాదాపు170 ట్రిలియన్ల ప్లాస్టిక్ ముక్కలు ఉన్నాయి. వీటి బరువు రెండు మిలియన్ టన్నులు ఉంటుంది. 2005 నుంచి సముద్రాల్లో ప్లాస్టిక్​ పొల్యూషన్ చాలా పెరిగింది. దీన్ని కానీ ఆపకపోతే 2040 నాటికి వ్యర్థాలు మూడు రెట్లు పెరుగుతాయి. ఇది మనందరికీ ఒక హెచ్చరిక లాంటిది. ప్లాస్టిక్ నివారణకు చట్టబద్ధమైన విధానాలు తీసుకురావాలి. ప్లాస్టిక్ నష్టాలపై ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడం అవసరం. ఎక్కువ ప్లాస్టిక్ వ్యర్థాలు నదులు, తీర ప్రాంతాల నుంచే సముద్రాల్లో కలుస్తున్నాయి. 2005 తర్వాత ప్లాస్టిక్ తయారీతో పాటు వాడకం కూడా పెరిగింది. దీంతో భూమిపై వీటి వ్యర్థాలు భారీగా పేరుకుపోయాయ”ని వివరించింది.


మనకు ఎంతో ఇస్తున్నది


జీవి మనుగడకు సముద్రం అత్యంత ముఖ్యం. సముద్రాలు లేని మానవ జీవనాన్ని ఊహించలేం. భూమి మొత్తం విస్తీర్ణంలో దాదాపు మూడు వంతులు సముద్రాలే. ఒక వంతు భాగంలో మనం జీవిస్తున్నాం. మిగిలిన జీవరాశుల మనుగడకు సముద్రాల ఉనికి చాలా కీలకం. సముద్రాల్ని క్షేమంగా కాపాడుకుంటేనే మనుషులూ, మిగిలిన జీవులు క్షేమంగా ఉండటానికి వీలవుతుంది. 


మన ఫుడ్​లో చాలా ఇంపార్టెంట్​ సాల్ట్​. అది దొరికేది సముద్రం నుంచే. చేపలు, రొయ్యలు, పీతల్లాంటి జలచరాలు సముద్రాల నుండే లభిస్తున్నాయి. అలాగే సముద్రపు పాచి, నాచు నుంచి సేకరించే పదార్థాలను ఫుడ్ ఐటమ్స్‌‌లో వాడతారు. సముద్రాల్లో దొరికే ప్రాన్స్​, సీవిప్‌‌ కోరల్స్‌‌ నుంచి సేకరించిన పదార్థాలు పెయిన్‌‌ కిల్లర్స్‌‌, ఇతర ఔషధ ఉత్పత్తుల్లో వాడతారు. సముద్ర తీరాల్లో లభించే ఇసుక.. భవన నిర్మాణాల్లో ఉపయోగపడుతోంది. మనకు ఇంత ఉపయోగపడుతున్న సముద్రాలకు మనం మాత్రం తిరిగి కాలుష్యాన్ని కానుకగా ఇస్తున్నాం. ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా కలుషితం చేస్తున్నాం.


సముద్ర జీవాలకు ముప్పు


సముద్రపు అంచుల్లో నివసించే జీవుల్లో మైక్రో ప్లాస్టిక్స్ బయటపడుతున్నాయి. ‘‘మైక్రో ప్లాస్టిక్స్ వల్ల నీరు కలుషితం అవుతోంది. ఇదొక్కటేనా ప్లాస్టిక్​ను ఫుడ్ అనుకొని సముద్రపు జీవులు తినడంతో వాటి ​ ఆర్గాన్స్​ దెబ్బతింటున్నాయి. మహా సముద్రాల్లో మైక్రో ప్లాస్టిక్స్ పెరిగిపోవడంతో ఇప్పుడు ప్రపంచ స్థాయిలో స్పందించాల్సిన అవసరం ఉంద’’ని పర్యావరణ నిపుణులు చెప్తున్నారు. తాబేళ్లు, తిమింగలాలు, ఇతర జలచరాలు ప్లాస్టిక్‌‌ను మింగడం లేదా వాటిల్లో చిక్కుకొని మరణిస్తున్నాయి. సముద్ర పక్షులు చేపలు అనుకుని ప్లాస్టిక్‌‌ను తింటున్నాయి. ఇలా చనిపోయిన పక్షుల కడుపుల్లో దాదాపు80 శాతం ప్లాస్టిక్‌‌ ఉంది. తిమింగలాల పొట్టలో నుంచి కేజీల కొద్దీ ప్లాస్టిక్ బయటపడిన ఘటనలూ ఉన్నాయి.


కారణాలేంటి?


సముద్రాలకు ప్లాస్టిక్ చేస్తున్న హానిని ఊహించలేమని సైంటిస్టులు ఆందోళన పడుతున్నారు. ‘‘బీచ్‌‌ల్లో చెత్త వేయడం, సాధారణ వ్యర్థాల నిర్వహణ లోపం, మురుగు కాలువలు, నదులు, వానలకు కొట్టుకుని రావడం వంటి కారణాలతో సముద్రంలోకి చెత్త చేరుతోంది. నిమిషానికి ఒక ట్రక్కు చెత్తను సముద్రంలోకి పారేస్తున్నం” అని ప్లాస్టిక్ ఓషన్ ఇంటర్నేషనల్ అనే ఎన్జీవో కో–ఫౌండర్ జూలీ ఆండర్సన్ చెప్పాడు. సముద్ర కాలుష్య సమస్యకు ఫిషింగ్ గేర్‌‌ (సముద్ర/జల వనరులను సేకరించడానికి ఉపయోగించే పరికరాలు) కూడా ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ‘ది నేచర్ కన్జర్వెన్సీ’, ‘యూసీ శాంటా బార్బరా’ 2021లో చేసిన స్టడీ ప్రకారం.. ఇండస్ట్రియల్ ఫిషింగ్ గేర్ నుంచి ఏటా100 మిలియన్ పౌండ్ల కంటే ఎక్కువ ప్లాస్టిక్ సముద్రపు చెత్తగా మారుతోంది. అంతకుముందు వరల్డ్ వైల్డ్‌‌లైఫ్ ఫౌండేషన్ చేసిన అధ్యయనం ప్రకారం.. ఏటా సముద్రపు చెత్తలో10 శాతం ఫిషింగ్ గేర్ వ్యర్థాలే ఉంటున్నాయి. వాస్తవానికి సముద్రాల్లో తేలియాడే చెత్త మాత్రమే ఫిషింగ్ గేర్ కాదు. ఓషన్ కన్జర్వెన్సీ ప్రకారం.. ఆహారాన్ని ప్యాక్​ చేసేందుకు వాడే ర్యాపర్లు, సిగరెట్ పీకలు, బాటిల్స్, వాటి క్యాప్‌‌లు, గ్రాసరీ బ్యాగులు మహా సముద్రాల్లోకి అత్యంత ఎక్కువగా చేరే వ్యర్థ వస్తువుల్లో కొన్ని.


తొమ్మిది శాతమే రీసైకిల్


ప్రపంచవ్యాప్తంగా కేవలం తొమ్మిది శాతం ప్లాస్టిక్ మాత్రమే రీసైకిల్ అవుతోంది. ‘ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో-–ఆపరేషన్ అండ్ డెవలప్‌‌మెంట్’ ఇటీవల ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం.. డైలీ ఉత్పత్తి అవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల్లో దాదాపు19 శాతాన్ని కాల్చేస్తున్నారు. మరో 49 శాతం గుట్టలుగా పేరుకుపోతోంది. మరో 22 శాతం మిస్ మేనేజ్ చేస్తున్నారు. ఇది ఇలానే కొనసాగితే భయంకర పరిస్థితులు తలెత్తుతాయి. ప్రపంచం ముందుకు వచ్చి ప్లాస్టిక్ కట్టడికి చర్యలు తీసుకోకపోతే.. 2040 నాటికి మహాసముద్రాల్లోకి చేరే చెత్త 64 బిలియన్ పౌండ్ల (2,902 కోట్ల కిలోల)కు పెరుగుతుందని రీసెర్చర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2050 నాటికి భూమిపై పోగయ్యే చెత్త 26 ట్రిలియన్ పౌండ్ల (11.79 లక్షల కోట్లు) వరకు ఉండొచ్చని మరో స్టడీ అంచనా వేసింది. ‘‘ప్లాస్టిక్ కాలుష్యం చాలా స్థిరంగా కొనసాగుతోంది. అలానే వదిలేస్తే అనేక దశాబ్దాలు లేదా శతాబ్దాల పాటు ఇలానే ఉండొచ్చు. సముద్రంలోకి ప్లాస్టిక్‌‌ చేరకుండా అడ్డుకోవాలంటే దాని మూలాలు తెలుసుకుని చర్యలు తీసుకోవాలి. అప్పుడే పరిష్కారాలు దొరుకుతాయి. దీనికి పూర్తి మ్యాపింగ్ అవసరం. ఒకసారి మహాసముద్రాల్లోకి చేరిన చెత్త.. చిన్న చిన్న భాగాలుగా విడిపోతుంది. కాలక్రమేణా మారిపోతుంది. కానీ నిజంగా అదృశ్యం కాదు. రికవరీ కార్యకలాపాలను మరింత క్లిష్టతరం చేస్తుంది” అని ‘ది ఓషన్ క్లీనప్’ రీసెర్చ్ హెడ్ లౌరెంట్ లెబ్రెటెన్ ఆందోళన వ్యక్తం చేశాడు.


నమ్మలేని నిజాలివి

 

  •     కొన్నేండ్లుగాసగటున ప్రతి నిమిషానికి ఓ ట్రక్కు చెత్త సముద్రంలో కలుస్తున్నట్లు అంచనా.
  •     గత వందేండ్లలో ఉత్పత్తి కానంత చెత్త.. కేవలం గత దశాబ్ద కాలంలోనే ఉత్పత్తి అయింది. 
  •  
  •  ఒక ప్లాస్టిక్ కవర్ మనకు ఉపయోగపడే సమయం సగటున కేవలం 15 నిమిషాలు. కానీ అవసరం తీరాక అది డీగ్రేడ్ కావడానికి 500 నుంచి వెయ్యేండ్లు పడుతుంది. డీగ్రేడ్ అయినంత మాత్రాన డీకంపోజ్ కాదు. మైక్రోప్లాస్టిక్స్‌‌గా మారుతుంది. మనుషులు, జంతువులకు విషపూరితంగా మారుతుంది. పావుగంటలో వాడేందుకు పనికిరాకుండా పోయే వస్తువును.. కొన్ని తరాల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదకర వస్తువుగా మారుస్తున్నాం.
  •  
  •     మనిషి సృష్టించిన ప్లాస్టిక్‌‌లలో 100% ఇప్పటికీ ఏదో ఒక రూపంలో ఉనికిలోనే ఉంది. ఈ విషయాన్ని యునైటెడ్ నేషన్స్ పర్యావరణ పరిరక్షణ సంస్థ పేర్కొంది.
  •  ప్రతి సంవత్సరం సుమారు 1,00,000 సముద్ర జంతువులు ప్లాస్టిక్‌‌ వల్ల చనిపోతున్నాయి. దాదాపు 90% సముద్ర పక్షులు ప్లాస్టిక్‌‌ను తింటున్నాయి. ప్లాస్టిక్​ను ఆహారం అనుకుని ప్రతి మూడు సముద్ర తాబేళ్లలో ఒకటి తింటున్నది.
  •  
  •     చివరికి తల్లి గర్భంలోని శిశువులకు అన్ని పోషకాలను అందించే.. బొడ్డుతాడు (ప్లెసెంటా)లో కూడా మైక్రో ప్లాస్టిక్‌‌ అవశేషాలు ఉన్నట్లు సైంటిస్టులు గుర్తించారు.
  •     2050 కల్లా ప్రపంచంలో మత్స్య సంపదతో సమానంగా ప్లాస్టిక్‌‌ సముద్రాల్లో చేరుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మత్స్యకారులు చేపలు పట్టేటప్పుడు ప్లాస్టిక్‌‌ వస్తువులు ఎక్కువగా పడుతున్నాయట. ఇటీవల కేరళలో మత్స్యకారుల వలలకు టన్నుల కొద్దీ ప్లాస్టిక్ చెత్త వచ్చి పడిందట.
  •     సముద్రాల్లో పోగవుతున్న చెత్తలో 80 శాతానికి పైగా ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటున్నాయి.
  •      ప్రపంచంలోని ఒక్క శాతం నదులు (సుమారు 1,000).. సముద్రాల్లోకి చేరే  80% ప్లాస్టిక్‌‌కు కారణమవుతున్నాయి.


క్లీనింగ్ ఇలా..


     ప్లాస్టిక్ చెత్త సముద్రాల్లోకి చేరకుండా ఆపడాన్ని నదులను శుభ్రపరచడం ద్వారా ప్రారంభించాలి. ‘ది ఓషన్ క్లీనప్’ అనే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్.. సముద్రాల్లో ప్లాస్టిక్ క్లీన్ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు 2 మిలియన్ కిలోలకు పైగా చెత్తను సముద్రం నుంచి తొలగించింది. 


 కాస్టింగ్ నెట్.. 


    సముద్రాల్లో ఏర్పడే ప్యాచ్‌‌లను తొలగించేందుకు నెట్స్​ వాడుతున్నారు. రెండు పడవలకు చెరో వైపు నెట్‌‌ను తగిలించి.. ‘యు’ ఆకారంలో వెళ్లి చెత్తనంతా మధ్యలోకి తీసుకొస్తారు. అక్కడి నుంచి తరలించి రీసైకిల్ చేస్తారు. ఈ ప్రాసెస్‌‌లో సముద్ర జీవులకు ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.


ఇంటర్ సెప్టార్ సిస్టమ్‌‌ 


నదికి అడ్డంగా ఒకవైపు నుంచి ఇంకోవైపుకు ‘ట్రాష్ ట్రెంచ్’ ఒకదాన్ని ఏర్పాటు చేస్తారు. ఇంటర్ సెప్టార్ బ్యారియర్ల ద్వారా చెత్త సేకరిస్తారు. నది వెడల్పు, లోతు, ప్రవాహ వేగం, చెత్త రకం వంటి అంశాల ఆధారంగా సేకరణ తీరు మారుతుంటుంది. ఈ మొత్తాన్ని ఏఐ కెమెరాలను ఉపయోగించి అంచనా వేస్తారు. చెత్తను తీయడానికి కన్వేయర్ బెల్ట్‌‌ వాడతారు.


గ్రేట్ బబుల్ బారియర్లు 


 గ్రేట్ బబుల్ బారియర్ల ద్వారా నది నుంచి వచ్చే చెత్త సముద్రంలో కలవకుండా చూస్తారు. ఈ బబుల్ బారియర్లను నదిలో వాలుగా ఏర్పాటుచేస్తారు. వాటి నుంచి వచ్చే గాలి బుడగలు ప్లాస్టిక్ చెత్తను అడ్డుకుంటాయి. వచ్చే చెత్త మొత్తం ఒడ్డున ఒక మూలకు చేరేలా చేస్తాయి. అక్కడి నుంచి చెత్తను సేకరిస్తారు.

 

రోజూ వాడే వస్తువులన్నీ..


నదుల ద్వారా, నేరుగా డంపింగ్‌‌ చేయడం ద్వారా భారీ స్థాయిలో ప్లాస్టిక్‌‌ చెత్త సముద్రాల్లోకి వచ్చి పడుతోంది. సముద్ర అంతర్గత ప్రవాహాల కారణంగా ఆ ప్లాస్టిక్‌‌ అక్కడక్కడా గుంపు (ప్యాచ్)గా చేరుతోంది. ఈ ప్లాస్టిక్‌‌ చెత్తలో మనం నిత్యం వాడే అన్ని రకాల వస్తువులు ఉంటున్నాయి. శాస్త్రవేత్తలు పసిఫిక్‌‌ ప్యాచ్‌‌లో పరిశీలించినప్పుడు.. ప్లాస్టిక్‌‌ బాటిల్స్​, గ్లాసులు, పాత్రలు, బొమ్మలు, టాయిలెట్‌‌ సీట్లు, చేపల వలలు, ఎలక్ట్రానిక్‌‌ పరికరాల ప్లాస్టిక్‌‌ భాగాలు, ఇంట్లో వాడే ఇతర ప్లాస్టిక్‌‌ వస్తువుల ముక్కలు, థర్మాకోల్‌‌ ముక్కలు... ఇలా ఇంకా ఎన్నో రకాలు కనిపించాయి.

 


ఏటా జూన్ 8న ఓషన్ డే


ఏటా జూన్‌‌ 8న ‘ప్రపంచ సముద్ర దినోత్సవం’ అని చేస్తున్నారు. 1992లో బ్రెజిల్‌‌లోని రియో డీ జెనీరో యూఎన్ కన్ఫరెన్స్‌‌ ఆన్ ఎన్విరాన్‌‌మెంట్ అండ్ డెవలప్‌‌మెంట్ ఆధ్వర్యంలో ఎర్త్ సమ్మిట్ జరిగింది. ఈ మీటింగ్‌‌లో ‘ఓషన్ డే’ కాన్సెప్ట్‌‌ను కెనడాకు చెందిన ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ డెవలప్‌‌మెంట్ (ఐసీవోడీ), ఓషన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెనడా (ఓఐసీ) ప్రతిపాదించాయి. సముద్రాల మీద అవగాహన పెంచడం కోసం ఏటా సముద్ర దినోత్సవం జరపాలని సూచించాయి. దీంతో 2002 నుంచి ‘ఓషన్ ప్రాజెక్టు’ను ప్రారంభించారు. కానీ కొన్ని యూరప్ దేశాలు నామమాత్రంగానే సాగర దినోత్సవాన్ని నిర్వహించాయి. 2005లో సునామీ వచ్చినపుడు జరిగిన అనర్థాలను దృష్టిలో ఉంచుకొని ఐక్యరాజ్యసమితి 2008 జాన్ 8న తొలిసారిగా ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని నిర్వహించింది.


ప్లాస్టిక్‌‌ను వాడకుండా ఉండలేమా?


ప్లాస్టిక్‌‌ను నియంత్రించడమెలా? నిజంగా మనం ప్లాస్టిక్‌‌ను వాడకుండా ఉండలేమా? శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉంటాయి. ‘‘విచ్చలవిడిగా ప్లాస్టిక్‌‌ను తయారుచేస్తూ.. రీసైకిల్ చేయాలి.. క్లీన్ చేయాలి అంటే ఎలా? అసలు ప్లాస్టిక్ తయారు చేయడమే మానేయాలి. అప్పుడు రీసైక్లింగ్, క్లీనింగ్ అవసరమే ఉండదు. ప్లాస్టిక్ బదులు మనకు ఎన్నో ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. కాకపోతే ప్రభుత్వాలకూ, ప్రజలకూ నిబద్ధత అవసరం. ప్లాస్టిక్ వాడే తీరు మారాలి”అంటున్నారు

సైంటిస్ట్​లు.


మనం బజారుకెళ్లి ఏం తెచ్చినా.. ప్లాస్టిక్‌‌ కవర్‌‌‌‌లోనే తెస్తాం. ఇంటికి వచ్చే వరకే ప్లాస్టిక్ కవర్ మనకు అవసరం. తర్వాత అది చెత్త బుట్టలోకి వెళ్తుంది. ఇలా ఒక రోజుకు, నెలకు, ఏడాదికి ఎంత ప్లాస్టిక్ చెత్తను మనం పడేస్తున్నాం అనేది ఆలోచించాలి. అవసరం మేరకే వాడుతున్నామా? అందుబాటులో ఉంది కాబట్టి విచ్చలవిడిగా వాడుతున్నామా? అనేది గమనించాలి. మితిమీరి తింటే మందు కూడా విషం అవుతుంది. అలాంటిది విషం లాంటి ప్లాస్టిక్‌‌ను.. ప్రతి దానికి ఉపయోగిస్తున్నాం.

మారాల్సింది మనం ప్లాస్టిక్​ వాడుతున్న పద్ధతి కదా! 


‘ప్లాస్టిక్ కవర్లపై నిషేధం’ అంటూ ఉత్తుత్తి ప్రకటనలతో కాకుండా ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలి. దశల వారీగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌‌ను నిషేధించాలి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు టార్గెట్లు పెట్టుకోవాలి. వాటిని సాధించేందుకు కృషి చేయాలి. బ్యాన్‌‌ను కాదని అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాలి. జనపనార లేదా క్లాత్ సంచుల వినియోగాన్ని ప్రోత్సహించాలి. తయారీదారులకు ఇన్సెంటివ్‌‌లు ఇచ్చి దన్నుగా నిలవాలి. ముఖ్యంగా బయోడీగ్రేడబుల్ సంచులను ఉపయోగించేలా ప్రజల్లో మార్పు తీసుకురావాలి. బంగాళాదుంపలతో కూడా క్యారీబ్యాగ్‌‌, స్పూన్స్‌‌, ప్లేట్స్‌‌, పిల్లల ఆట సామాగ్రిని తయారుచేస్తున్నారు. పర్యావరణానికి ఇవి ఎలాంటి హాని చేయవు. కొద్ది రోజులకే కరిగి భూమిలో కలిసిపోతాయి. వీటిని రీసైక్లింగ్‌‌కి కూడా వాడొచ్చు. బ్రిటన్‌‌, జపాన్‌‌లలో వీటిని ఇప్పటికే వాడుతున్నారు.


ఈ రోజుకు సముద్రాల్లో ఎంత ప్లాస్టిక్ చెత్త పేరుకుపోయింది? రేపటికి అది ఎంత అవుతుంది? వచ్చే ఏడాది ఎంత పెరుగుతుంది? ఇలాంటి ప్రశ్నలకు మనకు నిజంగా సమాధానాలు తెలియకపోవచ్చు. కానీ, సముద్రపు చెత్తా చెదారాన్ని నియంత్రించడానికి స్థానికంగా, ప్రాంతీయంగా, ప్రపంచ స్థాయిలో తీవ్రమైన ప్రయత్నాలు జరిగే వరకు భారీ మొత్తంలో ప్లాస్టిక్ వేస్ట్ సముద్రాల్లో పెరుగుతూనే ఉంటుంది.

10 వేల అడుగుల లోతున..


ఫిలిప్పీన్స్ మెరైన్ సైన్స్ ఇని​స్టిట్యూట్​కు చెందిన మైక్రోబయల్​ ఓషియనాలజిస్ట్​ డాక్టర్ డియో ఫ్లోరెన్స్ ఓండా.. 2021లో పసిఫిక్ సముద్రంలోని ‘ఎమ్డెన్ డీప్’లో 10,000 మీటర్ల లోతైన ప్రదేశానికి వెళ్లారు. అది ప్రపంచంలోని అతి పురాతనమైన, భూమ్మీద మూడో లోతైన ట్రెంచ్ (కందకం). సముద్రంలో దాగి ఉన్న రహస్యాలను కనుగొనడం కోసం ఆ సాహసం చేశారు. 10,000 మీటర్ల లోతులో పదార్థాలను, వాతావరణాన్ని పరిశీలించారు. ఆయనతో పాటు అమెరికన్​ సైంటిస్ట్​ విక్టర్​ వెస్కోవా వెళ్లారు. ఇద్దరూ దాదాపు 12 గంటల పాటు అన్వేషించారు. “మేమిద్దరం సముద్రంలోని లోతైన ప్రదేశానికి వెళ్లగానే తెలుపు రంగులోని పదార్థాలు​ కనిపించాయి. వాటిని మొదట జెల్లీ ఫిష్​ అనుకున్నాం. తీరా దగ్గరకు వెళ్లి చూస్తే... అవన్నీ ప్లాస్టిక్​ వ్యర్థాలని అర్థమైంది. ఇంత లోతులో ప్లాస్టిక్​ వ్యర్థాలు ఉండటం చూసి ఆశ్చర్యపోయాం. బట్టలు, పాత బొమ్మలు, ప్యాకేజింగ్ వస్తువులు, ప్లాస్టిక్ సంచులు ఇలా చాలా వస్తువులు అక్కడ పేరుకు
పోయాయ’’ని చెప్పారు ఓండా.

ఊహించలేనంత నష్టం


సముద్రం ఒక క్రైం ప్లేస్​గా మారింది – ఇది ఒక సైంటిస్టు ఆవేదన. నీటిలో తప్ప ఇంకెక్కడా బతకలేని జలచరాలకు.. సముద్రమే ప్రమాదకరమైన ప్రదేశంగా మారుతోంది. మనకెన్నో ఇస్తున్న సముద్రాన్ని అంతలా మనమే నాశనం చేస్తున్నాం. నీళ్లు, సముద్రపు ఉత్పత్తులు కలుషితం అయిపోతున్నాయి. అమెరికా సహా పలు దేశాల్లోని సముద్ర తీర ప్రాంతాల్లో మట్టి, ఇసుకను పరిశీలించిన శాస్త్రవేత్తలు.. వాటిలో ప్లాస్టిక్‌‌ అవశేషాలు గణనీయంగా ఉన్నట్టు గుర్తించారు. మనం తినే తిండి, తాగే నీళ్లు.. ఓ లెక్కన చెప్పాలంటే మన శరీరంలోకి కూడా మైక్రో ప్లాస్టిక్‌‌ చేరిపోతోంది. అసలు మైక్రో ప్లాస్టిక్‌‌ (సూక్ష్మస్థాయి ప్లాస్టిక్‌‌ ముక్కలు) లేని ప్రదేశమే లేకుండా పోయిందని సైంటిస్టులు చెప్తున్నారు. ఇటీవల జరిగిన పరిశోధనల ప్రకారం... గాలిలోని దుమ్ములో, తాగే మంచినీళ్లలో, సముద్ర జీవుల కడుపుల్లో మైక్రో ప్లాస్టిక్‌‌ను గుర్తించారు. మనం తప్పు చేసి శిక్ష అనుభవించడమే కాకుండా ఎన్నో కోట్ల జీవరాశులను బలి చేస్తున్నాం. భవిష్యత్ తరాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాం. ‘‘ఏటా 640 వేల టన్నుల ఫిషింగ్ ఎక్విప్ మెంట్​ను సముద్రాల్లో డంప్ చేస్తున్నారు. ప్లాస్టిక్ నుంచి వెలువడే రసాయనాలతో నీళ్లు కలుషితమవుతున్నాయి. ఆ ప్రభావం సముద్ర జీవులపై పడుతోంది. వాటినుంచి ఆ ఎఫెక్ట్​ మనుషుల ఆరోగ్యంపై పడుతోంది” అని డబ్ల్యూయూఎన్ గ్లోబల్ రీసెర్చ్ గ్రూప్ రీసెర్చర్లు ఆందోళన పడుతున్నారు. 


ప్లాస్టిక్​ లేని ఊరు


ప్లాస్టిక్ వల్ల ఈ భూమ్మీద ప్రతి ప్రాణికి ప్రమాదమే. అందుకే మన దేశంతో సహా ప్రపంచంలో అనేక దేశాలు ప్లాస్టిక్​ వాడకం తగ్గించాయి. వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పారేయకుండా చర్యలు తీసుకుంటున్నాయి. ప్లాస్టిక్​ వల్ల కలిగే అనర్థాలను గుర్తించిన ఓ గ్రామ సర్పంచ్​ వాళ్ల ఊరిని ప్లాస్టిక్​ రహిత పంచాయితీగా మార్చాలి అనుకున్నాడు. కానీ, అది అంత ఈజీ కాదని కొత్తగా ఆలోచించాడు. దాంతో ఆయన లక్ష్యం15 రోజుల్లోనే నెరవేరింది. సౌత్ కశ్మీర్ అనంతనాగ్ జిల్లాలోని షహబాద్ బ్లాక్ సాదీవర పంచాయతీకి ఫరూక్‌ అహ్మద్ గనయ్​ సర్పంచ్. ఇంతకుముందు ఆయన లాయర్​గా పనిచేశారు. వాళ్ల గ్రామంలో ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా చేయాలనుకుని.. ‘ప్లాస్టిక్ తీసుకురండి- బంగారం గెలుచుకోండి’ అని ప్రకటించాడు. ఈ కార్యక్రమంలో భాగంగా 20 క్వింటాళ్ల ప్లాస్టిక్ వ్యర్థాలను తీసుకొచ్చిన వాళ్లకు ఒక బంగారు నాణెం ఇస్తామని చెప్పాడు. దాంతో ఊరివాళ్లంతా ప్లాస్టిక్​ సేకరించే పనిలో పడ్డారు. దాంతో.. పదిహేను రోజుల్లో ఆ ఊళ్లో ప్లాస్టిక్ కనిపించకుండా పోయింది. ఆ తరువాత గవర్నమెంట్​ ఆ గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా ప్రకటించింది.

రీసైక్లింగ్‌‌కు కట్టుబడితేనే..


ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించడం మున్సిపాలిటీల ప్రాథమిక విధుల్లో ఒకటి. తడి, పొడి చెత్తను వేరుగా తీసుకోవాలి. రీసైక్లింగ్ చేపట్టాలి. అయితే ఈ పని ఎక్కడా సరిగా జరగదు. కానీ, ఒడిశాలోని సంబల్‌‌పూర్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్‌‌ఎంసీ) చెత్త నుంచి ఆదాయం సంపాదించుకుంటోంది. ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి.. అమ్మడం ద్వారా ప్రతి నెల రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల దాకా ఆదాయం పొందుతోంది. ‘‘గ్లాస్, పేపర్, కార్డ్‌‌బోర్డ్, మెటల్, ప్లాస్టిక్, టైర్లు, బట్టలతో సహా16 రకాల రీసైకిల్ చేయగలిగే వ్యర్థాలు వేరు చేస్తోంది. ఎంపిక చేసిన ఏజెన్సీకి.. ఒక్కో ఐటమ్‌‌ను ఒక్కో ధరకు అమ్ముతోంది. సంబల్‌‌పూర్ సిటీలో రోజూ110 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుంటే.. తొమ్మిది వెల్త్ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రాసెస్ చేస్తున్నారు. తొలుత గృహాలు, వాణిజ్య సంస్థల నుంచి సేకరించిన చెత్తను వెల్త్ సెంటర్లకు తీసుకొస్తారు. ఈ సెంటర్లలో మైక్రో కంపోస్టింగ్ సెంటర్ (ఎంసీసీ), మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ (ఎంఆర్ఎఫ్) ఏర్పాటు చేశారు. నగరంలో ఉత్పత్తయ్యే బయోడీగ్రేడబుల్ వ్యర్థాలను ఎంసీసీలో కంపోస్టుగా మారుస్తారు. అలాగే నాన్ డీగ్రేడబుల్ చెత్తను ఎం.ఆర్‌‌.‌‌ఎఫ్‌‌.కు తెచ్చి వేరుచేస్తారు. అలా వేరు చేసిన తర్వాత రీసైకిల్ చేయడానికి వీలులేని చెత్తను.. ఇంధనంగా వాడేందుకు సిమెంట్ ఫ్యాక్టరీకి పంపుతారు. రీసైకిల్ చేయగలిగే చెత్తను ఏజెన్సీకి అమ్ముతారు. వేస్ట్‌‌ను కూడా వేస్ట్ చేయకుండా ఆదాయవనరుగా మార్చుకుంటున్నారు వాళ్లు.

2017లో బ్రిటన్​కు చెందిన అండర్‌‌‌‌వాటర్ ఫొటోగ్రాఫర్ కారొలిన్ పవర్ తీసిన ఫొటో ఇది. హొండురాస్‌‌లోని రొవాటెన్ ఐలాండ్‌‌కి దగ్గర్లో కరేబియన్ సముద్రంలో ఇలా కొన్ని కిలోమీటర్ల మేర చెత్త పేరుకుపోయింది. హోండురాస్, గాటెమాలలో అడ్డూఅదుపు లేని ప్లాస్టిక్ వినియోగానికి ఇదో ఉదాహరణ. సముద్రాల్లో ప్లాస్టిక్ ఎంతలా పేరుకుపోతుందో చెప్పేందుకు ఇదో నిదర్శనం. పైగా ‘దీనికి మీదే బాధ్యత’ అంటూ రెండు దేశాలు ఒకరినొకరు నిందించుకోవడం గమనార్హం.

 

  • కొట్టాల రాము