
విఘ్నేశ్వరుడు ప్రకృతి స్వరూపం.. 21 రకాల ఔషధ గుణాలు కలిగిన మొక్కలతో గణాధిపతిని ఆరాధిస్తారు. ఇవన్నీ మహోత్కృష్టమై, శక్తివంతమైన ఔషధ గుణాలు కలిగినవి.
మాచీ పత్రం: చామంతి జాతికి చెందిన దీని ఆకులు సువాసనను వెదజల్లుతాయి. తలనొప్పి, చర్మ సంబంధ సమస్యలు తొలగిపోతాయి. కండరాల నొప్పులతో బాధపడేవారు ఈ ఆకు వాడితే విశేషమైన ప్రభావం ఉంటుంది. ఈ ఆకును తెలుగులో మాచ పత్రి అని పిలుస్తారు.
బృహతీ పత్రం: ములకగా పిలిచే దీనిలో చిన్న ములక, పెద్ద ములక అని రెండు రకాలుంటాయి. దీని పత్రాలు వంగ ఆకుల మాదిరిగా ఉంటాయి. తెల్లని చారలుండే గుండ్రని పండ్లతో ఉంటాయి. ఈ ఆకులు జీర్ణ, గుండి, చర్మ సంబంధ సమస్యలను నివారిస్తాయి.
బిల్వా పత్రం: దీనికి మారుపేరు మారేడు ఆకు. మూడు ఆకులుగా, ఒక ఆకుగా ఉండే ఇవి శివుడికి చాలా ఇష్టం డయాబెటిస్ నియంత్రణకు డయేరియా, గ్యాస్ట్రిక్ సమస్యలను నివారించే ఔషధ గుణాలు ఈ ఆకులో ఉన్నాయి..
దూర్వా పత్రం: దూర్వా పత్రం అంటే గరిక తెల్ల గరిక, నల్ల గరిక అని రెండు రకాలుంటాయి. గడ్డి జాతి మొక్కలు గణేషుడికి అత్యంత ప్రీతికరం. గాయాలు, అలర్జీలు, ఉదర సంబంధ సమస్యలను నివారించే గుణం గరికకు ఉంటుంది.
దత్తూర పత్రం: దీన్ని ఉమ్మెత్త అని,పిలుస్తారు. వంకాయరంగు పూలు ఉండి. ముళ్లతో కాయలుంటాయి. కాటిన చర్మానికి, బొబ్బలకు ఈ ఆకు చక్కగా పని చేస్తోంది.
బదరీ పత్రం: దీనికి మరొక పేరు రేగు, రేగు,ఉట్రేగు, గంగరేగు అని మూడు రకాలుంటాయి. దగ్గు, గొంతు జీర్ణ సంబంధ సమస్యలను తగ్గిస్తాయి.
అపామార్గ పత్రం: దీనిని ఉత్తరేణి అంటారు.గుండ్రంగా ఉండే ఆకులు శివునికి ఇష్టమని చెబుతుంటారు. పాము కాటుకు గాయాలు నయం కావడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
తులసీ పత్రం: తులసీ పత్రాలను దేవతార్చనలో వాడుతారు. వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడానికి, దగ్గు, జలుబు, జ్వర నియంత్రణకు పని చేస్తుంది. అనేక అనారోగ్య సమస్యలకు తులసీ మంచి ఔషధం.
చూత పత్రం: దూత పత్రం అంటే మామిడి ఆకు హిందూ కుటుంబాల్లో మామిడి ఆకును ప్రతి శుభకార్యంలో వాడుతారు. రక్త విరేచనాలు, చర్మంపై దద్దుర్లను తగ్గించడంతో పాటు కీటకాలను ఇంట్లోకి రానివ్వకుండా. అద్దుకుంటుంది.
కరవీర పత్రం: గన్నేరు అని కూడాపిలుస్తారు. తెలుపు పసుపు, ఎరుపు రంగుల పూలు ఉంటాయి. పూజలో ఈ పూలకు విశిష్ట స్థానం ఉంది. క్యాన్సర్, ఆస్తమా నివారణకు ఉపయోగపడుతుంది.
విష్ణుక్రాంత పత్రం: ఇది నీలం, తెలుపు పువ్వులుండే చిన్న మొక్క నీలి పువ్వులుండే రకాన్ని విష్ణుక్రాంత అంటారు. జ్ఞాపకశక్తిని పెంచడానికి జుట్టు పెరుగుదలకు జులుబు.. దగ్గు, జ్వరం, ఆస్తమా, నరాల బలహీనత నివారణకు ఉపయోగపడుతుంది.
దాడిమీ పత్రం: దాడిమీ అంటే దానిమ్మ ఆకు. ఈ ఫలం ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. దయేరియా, కంటి జబ్బులు, చర్మ -సంబంధిత సమస్యల నివారణకు చక్కగా పని చేస్తుంది.
దేవదారు పత్రం: దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దేవదారు. ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది. అజీర్తి నివారణకు, చర్మ వ్యాధుల నియంత్రణకు చక్కగా పని చేస్తుంది.
మరువక పత్రం: ఈ పత్రాన్ని వాడుక భాషలో ధవనం, మరువం అని అంటారు.. ఆకులు ఎండినా మంచి సువాసనను వెదజల్లుతాయి. జుట్టు రాలడం, జీర్ణ సంబంధ సమస్యలకు నివారిణిగా పని చేస్తుంది.
సింధువార పత్రం: దీన్ని వాడుకలో వావిలి అని పిలుస్తారు. జ్వరం, తలనొప్పి, కీళ్ల నొప్పులు, చెవి నొప్పుల నియంత్రణకు ఉపయోగిస్తారు.
ఆర్య పత్రం: ఈ ఆకునే జిల్లేడు ఆకు అంటారు. శివుడి పూజకు తెల్ల జిల్లేడు ఆకులను వినియోగిస్తారు. చెవి నొప్పి, కాలిన గాయాలు, దగ్గు, దంత సంబంధ సమస్యల నివారణలో ఉత్తమంగా పని చేస్తుంది.
జాజి పత్రం: సన్నజాజి అనే మల్లిజాతి మొక్క ఇది. ఈ పువ్వుల నుంచి సుగంధ తైలం తీస్తారు. ఒళ్లు నొప్పులు, మొటిమలు, చర్మ-సంబంధ సమస్యల నివారణ దివ్య ఔషధం.
గండకీ పత్రం : దీన్ని దేవ కాంచన అని కూడా పిలుస్తారు. శివుడికి అత్యంత ప్రీతికరమైన పత్రం ఇది. సీతాకోక చిలుక మాదిరి దీని పత్రాలు ఉంటాయి. దగ్గు, ఉదర సంబంధం సమస్యలను నివారిస్తుంది.
శమీ పత్రం: జమ్మి చెట్టు ఆకులను శమీ ఆకులు అంటారు. దసరా రోజున ఈ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఫైల్స్, కుష్ఠు నివారణకు, దంత సమస్యలకు ఈ క్షేత్రం 'చక్కగా పని చేస్తుంది.
అశ్వత్థ పత్రం: వీటినే రావి ఆకుల అంటారు. రక్త శుద్ధికి, ఆస్తమా సహా వివిధ వ్యాధులను దరిచేరకుండా చేసే ఔషధ గుణాలు రావి ఆకుల్లో ఉన్నాయి.
అర్జున పత్రం: మద్దిచెట్టు ఆకులనే అర్జున పత్రం అంటారు. మర్రి చెట్టు ఆకులను పోలి ఉంటాయి. అడవుల్లో ఈ చెట్లు పెరుగుతుం టాయి. రక్తపోటు, గుండెసంబంధిత వ్యాధులను నియంత్రిస్తుంది ఈ ఆకు శాపం వల్ల కుబేరుడు ఈ చెట్టులా మారిపోయాడని అంటారు.