శంకుస్థాపనలో వివాదం-ఎమ్మెల్యే అవమానించాడని ఎంపీపీ నిరసన

శంకుస్థాపనలో వివాదం-ఎమ్మెల్యే అవమానించాడని ఎంపీపీ నిరసన

యాచారం: రోడ్డు పనుల శంకుస్థాపనకు తనకు సమాచారం ఇవ్వలేదని స్థానిక ఎంపీపీ నిరసన వ్యక్తం చేశారు. ఈ సంఘటన గురువారం రంగారెడ్డి జిల్లా యాచారంలో జరిగింది. యాచారం మండలం నందివనపర్తి వద్ద రూ. 23 కోట్లతో నిర్మించనున్న 5.7కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులకు గురువారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి హాజరయ్యారు. అయితే తనకు సమాచారం ఇవ్వలేదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేని నిలదీశారు యాచారం ఎంపీపీ సుకన్య.

సమాచారం అందుకుని శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లిన తనను ఎమ్మెల్యే ఏ మాత్రం పట్టించుకోలేదని తెలిపారు సుకన్య. తన చేయి పక్కకు లాగి ఎమ్మెల్యే మంచిరెడ్డి కొబ్బరికాయ కొట్టాడని చెప్పారు. అంతేకాకుండా  తనను బలవంతంగా పోలీసులు పక్కకు లాక్కెళ్లి, నిరసనల మద్యే రోడ్డు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారని తెలిపారు ఎంపీపీ సుకన్య. ఇందుకు నిరసనగా యాచారం చౌరస్తాలో ఎంపీపీ, ప్రజాప్రతినిధులు, బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు.

ఎమ్మెల్యే అనుచరులు, అధికార పార్టీ నాయకులు తమకు కావాలనే సమాచారం ఇవ్వలేదని తెలిపారు యాచారం ఎంపీపీ సుకన్య తెలిపారు. లాక్ డౌన్ లో ఇతర మండలాల నుండి అనేక మందిని సమీకరించి స్థానికులు లేకుండానే శంకుస్థాపన చేశారని.. అడిగిన వారిని పోలీసులతో దాడి చేయించారని చెప్పారు. ఎమ్మెల్యే పై ఎస్సి, ఎస్టీ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని.. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహ రెడ్డి డిమాండ్ చేశారు.