అతిగా గంజాయి తాగి యువకుడి మృతి

అతిగా గంజాయి తాగి యువకుడి మృతి

హనుమకొండ జిల్లాలో దారుణం జరిగింది. అతిగా గంజాయి సేవించిన యువకుడు.. అనారోగ్యంతో మృతిచెందాడు. భీమదేవరపల్లి మండల కేంద్రానికి చెందిన దికొండ మణిదీప్ (23) అనే యువకుడు అతిగా గంజాయి సేవించాడు. దాంతో తీవ్ర అనారోగ్యం పాలయై.. శుక్రవారం చనిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. గంజాయి ఎక్కడ నుంచి తెచ్చారోనని దర్యాప్తు చేస్తున్నారు.