కలుపుమందు ఎఫెక్ట్‌తో యువతి మృతి

కలుపుమందు ఎఫెక్ట్‌తో యువతి మృతి

రాయపర్తి, వెలుగు: కలుపు మందు ఎఫెక్ట్ తో ఓ యువతి మృతి చెందింది. స్థానిక ఏఎస్సై లింగారెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రానికి చెందిన మచ్చ ప్రియాంక(19) తండ్రి శ్రీని వాస్ తో కలిసి ఈ నెల 15న వరిలో కలుపు మందు స్ప్రే చేసేందుకు వెళ్లింది. వాసన పడక పోవడంతో అక్కడే వాంతులు చేసుకుంది. ట్రీట్మెంట్ కోసం ఎంజీఎం హాస్పటల్లో చేర్పించారు. చికిత్సపొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం..