ఎన్ని అడ్డంకులు వచ్చినా ‘ప్రజాప్రస్థానం’ ఆగదు : వైఎస్ షర్మిల

ఎన్ని అడ్డంకులు వచ్చినా ‘ప్రజాప్రస్థానం’ ఆగదు : వైఎస్ షర్మిల

ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆగదని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆశాభావం వ్యక్తం చేశారు. పాదయాత్రకు అనుమతి కోసం మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. ప్రజాసమస్యలపై అధికారపార్టీ ఎమ్మెల్యేలను తాను నిలదీయడం తప్పా..? అని ప్రశ్నించారు. తన పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి బీఆర్ఎస్ నాయకుల్లో భయం పట్టుకుందన్నారు. అధికార దాహంతో బీఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమకు మాటిచ్చారని, త్వరలోనే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చేరుతారని భావిస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కబ్జాకోరులు, భూ బకాసురులు అంటూ మరోసారి వైఎస్ షర్మిల ఆరోపించారు.