బంగారు తెలంగాణ కాదిది....బాధల తెలంగాణ అని విమర్శించారు వైఎస్ షర్మిల. ఖమ్మం జిల్లా సరిహద్దు తిరుమలాయపాలెం మండలంలో షర్మిల పాదయాత్ర కోనసాగిస్తున్నారు. సోలీపురం గ్రామంలో షర్మిలకు వైఎస్సార్ టీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రం బార్లు - బీర్లు - ఆత్మహత్యల తెలంగాణ గా మారిందని షర్మిల విమర్శించారు. కేసిఆర్ ను రెండు సార్లు సీఎంను చేస్తే ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. ఇంకోసారి కేసీఆర్ ను నమ్మి మోసపోవద్దన్నారు షర్మిల.
వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థాన పాదయాత్ర 45వ రోజుకు చేరుకుంది. సూర్యాపేట జిల్లా నుంచి ఖమ్మం జిల్లా సరిహద్దు తిరుమలాయపాలెం మండలానికి చేరుకుంది. సోలీపురం గ్రామంలో షర్మిలకు వైఎస్సార్ టీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి పాదయాత్రను కొనసాగించారు. తిరిమళాయపాలెం మండలం నుంచి జూపెడ గ్రామం, కీరియా తండా మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. పాదయాత్రలో ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోనున్నారు షర్మిల. సాయంత్రం బచోడు గ్రామంలో గ్రామస్తులతో మాట ముచ్చట కార్యక్రమం నిర్వహించనున్నారు.
ప్రజాప్రస్థానం పాదయాత్ర 45వ రోజు కోదాడ నియోజకవర్గం మోతె నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెంలోకి ప్రవేశించింది. తిరుమలాయపాలెం నుంచి సోలిపురం, కాకర్వాయి, జూపెడ, కీర్యాతండా, బాచోడు తండా మీదుగా పాదయాత్ర సాగుతోంది. 1/2 pic.twitter.com/w5J4lWA89z
— YS Sharmila (@realyssharmila) April 4, 2022