ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుండాలి

 ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుండాలి

కేసీఆర్ పోలీసులను పని మనుషులుగా వాడుకుంటున్నారని మండిపడ్డారు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా పని చేయకూడదని సూచించారు. పోలీసులు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు న్యాయం చేయలన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులు ఉండాలన్నారు. రాష్ట్రంలో నియంత పాలన పోయి ప్రజాపాలన రావాలన్నారు షర్మిల. యాదాద్రి భూవనగిరి జిల్లా బుల్లెపల్లిలో వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది.