హైదరాబాద్: గాలిలో మేడలు కట్టడం, హామీలతో కడుపు నింపడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య అని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల అన్నారు. రైతులకు వంద శాతం ఉచిత ఎరువులు ఇస్తామన్న సీఎం.. ఇచ్చిన హామీని వంద శాతం ఎగ్గొట్టారని ఆమె మండిపడ్డారు. హామీ ఇచ్చి నాలుగేండ్లయినా ఎరువులు ఇచ్చింది లేదన్నారు. పెట్టిన పెట్టుబడి రాక, ఎరువుల భారం మోయలేక అన్నదాతలు చనిపోతున్నా రాష్ట్ర సర్కారు ఆదుకోవడం లేదని దుయ్యబట్టారు. రైతులు పాడె ఎక్కుతున్నా సారు మాత్రం దేశాలు ఏలడానికి పక్క రాష్ట్రాలు తిరుగుతున్నారని విమర్శించారు. సొంతరాష్ట్ర రైతులను ఆదుకోవడం చేతకాని కేసీఆర్.. దేశాన్ని ఏం ఉద్ధరిస్తారని షర్మిల ప్రశ్నించారు.
గాల్లో మేడలు కట్టడం,హామీలతో కడుపు నింపడం దొరకు వెన్నతో పెట్టిన విద్య. వందకు వంద శాతం రైతులకు ఉచిత ఎరువులు ఇస్తానన్న కేసీఆర్ గారు,ఇచ్చిన హామీని వందకు వంద శాతం ఎగ్గొట్టాడు.హామీ ఇచ్చి నాలుగేండ్లయినా ఎరువులు ఇచ్చింది లేదు. కనీసం ఎప్పుడిచ్చేది చెప్పింది లేదు.పెట్టిన పెట్టుబడి రాక, 1/2
— YS Sharmila (@realyssharmila) March 7, 2022
మరిన్ని వార్తల కోసం