అంబేద్కర్ వల్లే కేసీఆర్ సీఎం అయ్యిండు

అంబేద్కర్ వల్లే కేసీఆర్ సీఎం అయ్యిండు

పులి బిడ్డనని చెప్పుకుంటున్న కేసీఆర్..మోడీ వచ్చినప్పుడు పిల్లిలాగా ఎందుకు దాక్కున్నారన్నారు వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.  ప్రజా సమస్యలపై మోడీని ఎందుకు నిలదీయడం లేదో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. ఢిల్లీ కోటలు బద్దలు కొడుతానని చెప్పిన కేసీఆర్.. మోడీ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఎందుకు ఎదురు పడలేదన్నారు. అంబేద్కర్ రాసిన  రాజ్యాంగాన్ని మార్చాలని అనుకోవడం కేసీఆర్  అహంకారానికి నిదర్శనమన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే తెలంగాణ వచ్చిందని.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే కేసీఆర్ సీఎం అయ్యాడన్నారు. ఉద్యమకారులను, అమర వీరులను కేసీఆర్ ఎప్పుడైనా పరామర్శించాడా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను, వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి .. నిరుద్యోగుల ఆత్మహత్యలు, రైతు ఆత్మహత్యలు, ప్రజా సమస్యలు పక్క దారి పట్టించడానికే సీఎం కేసీఆర్ రాజ్యాంగం అంశాన్నితెర మీదికి తీసుకు వచ్చారన్నారు. 

భారీ ధరకు అమ్ముడుపోయిన భారత స్టార్ బ్యాట్స్మన్

హిజాబ్ వివాదంపై స్పందించిన విదేశాంగ శాఖ 

కొత్త ఎడ్యుకేషన్ పాలసీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్