హైదరాబాద్ : వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల మరోసారి కేసీఆర్ సర్కార్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. గ్రూప్-1 రాయకండి.. మనయ్ మనమే రాసుకుందమని తెలంగాణ ఉద్యమంలో రెచ్చగొట్టిన కేసీఆర్.. స్వరాష్ట్రంలో పెద్ద కొలువులు ఎక్కడ పాయే.. అని ప్రశ్నించారు. ఊరించి ఊరించి తొమ్మిదేండ్లకు ఇచ్చిన ఒక్క నోటిఫికేషన్ కూడా గట్టు దాటక పాయె అని మండిపడ్డారు.
503 పోస్టులకు రెండు సార్లు పరీక్షలు జరిగి రద్దు అయిన ఘటన.. దేశంలోనే కేసీఆర్ అసమర్థ విధానాలకు ఒక దర్పణం అని ట్వీట్ లో తెలిపారు. TSPSCకి విశ్వసనీయత లేదని చెప్పినా.. దర్యాప్తు జరుగుతున్నప్పుడు పాత బోర్డుతో పరీక్షలు వద్దని మొత్తుకున్నా.. బయోమెట్రిక్ విధానాన్ని ఎందుకు ఎత్తివేశారని నెత్తి నోరు బాదుకున్నా.. పట్టింపు లేకుండా పరీక్షలు పెట్టిన కేసీఆర్ కు హైకోర్టు తీర్పు ఒక చెంపపెట్టు అని చెప్పారు.
ఉద్యమంలో గ్రూప్-1 రాయకుండ్రి, మనయ్ మనమే రాసుకుందమని రెచ్చగొట్టిన దొర.. ఎక్కడ పాయె స్వరాష్ట్రంలో పెద్ద కొలువులు? ఊరించి ఊరించి 9 ఏండ్లకు ఇచ్చిన ఒక్క నోటిఫికేషన్ గట్టు దాటక పాయె. ఒక్కరికీ ఉద్యోగం దక్కకపాయె. 503 పోస్టులకు రెండు సార్లు పరీక్షలు జరిగి రద్దైన ఘటన.. బహుశా దేశంలోనే మీ…
— YS Sharmila (@realyssharmila) September 23, 2023