రాష్ట్రంలో తమ పార్టీ ఆషామాషీగా ఉండబోదన్నారు వైసీపీ నేత కొండరాఘవరెడ్డి. కొత్తపార్టీలను కేసీఆర్ పాన్ డబ్బాలతో పోల్చడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. ఇతర పార్టీల నేతల కోసం చూడడం లేదని… ప్రజల నుంచే కొత్త నాయకులను తీసుకొస్తామన్నారు. 75 శాతం ప్రజలు రాజన్న రాజ్యం కావాలనుకుంటున్నారని చెప్పారు. మడమ తిప్పకుండా… మాట తప్పకుండా పక్కగా ముందుకెళ్తమన్నారు రాఘవరెడ్డి. అన్ని జిల్లాల నేతలతో రివ్యూల తర్వాత పూర్తిస్థాయి సమ్మేళనం నిర్వహించి…రాజన్న రాజ్యంపై క్లారిటీ ఇస్తామన్నారు.
see more news