
వర్షాకాలం స్టార్ట్ అయ్యింది. రైతులు పొలాలను చదును చేస్తున్నారు. ట్రాక్టర్లతో నేలను చదును చేసి విత్తనాలు వేస్తున్నారు. అయితే రైతులు ట్రాక్టర్లతో నేలను దున్నేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ మధ్య ట్రాక్టర్లలో,రొటవేటర్లో చిన్న పిల్లలు ఇరుక్కుని చనిపోతున్న ఘటనలను మనం చూస్తున్నాం. జూన్ 11న చేవెళ్లలో ఇలాంటి ఘటనే జరిగింది.
లేటెస్ట్ గా చేవెళ్ల నియోజకవర్గంలోని తంగడపల్లి గ్రామం పరిధిలో ఓ ఫామ్ హౌస్ లో. జూన్ 11న మధ్యాహ్నం 1.30 లకు మామిడి తోటలో రోటవేటర్ వేస్తుండగా 11 సంవత్సరాల బాలిక అందులో ఇరుక్కుని మృతి చెందింది. బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. తల భాగం మొత్తం చితికిపోయింది. చేవెళ్ల హాస్పటల్ కి తరలించినా లాభం లేకుండా పోయింది.
బాలిక మృతితో కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. అప్పటి వరకు ఆడుకుంటున్న చిన్నారి కళ్ల ముందే చితికిపోవడంతో దుఖాన్ని ఆపుకోలేకపోతున్నారు. రైతన్నలు ఎందుకైనా మంచిది ట్రాక్టర్లతో దున్నేటప్పుడు జాగ్రత్తగా ఉండండి..చిన్న పిల్లలు ట్రాక్టర్ దగ్గరకు వెళ్లనివ్వకుండా చూడండి.