
పద్మారావునగర్, వెలుగు: దక్షిణ మధ్య రైల్వే 69వ వారోత్సవాలు శుక్రవారం సికింద్రాబాద్ న్యూబోయిగూడ రైల్ కళారంగ్ లో ఘనంగా జరిగాయి. జీఎం అరుణ్కుమార్ జైన్ ముఖ్య అతిథిగా పాల్గొని 36 మందికి జోనల్ ఎఫిషియెన్సీ షీల్డ్లు, 75 మందికి విశిష్ట రైల్ సేవా పురస్కార్ అవార్డులు అందజేశారు. రైల్వే అడిషనల్జీఎం నీరజ్ అగ్రవాల్, సీనియర్ డిప్యూటీ జీఎం జె.వినయన్, డిప్యూటీ జీఎం(జనరల్) ఉదయనాథ్ కోట్ల పాల్గొన్నారు.