
పరిగి, వెలుగు: ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారి నీటి బకెట్ లో పడి మృతి చెందింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పరిగిలో జరిగింది. బిహార్ కు భార్యాభర్తలు పరిగిలోని టీచర్స్కాలనీలో ఉంటూ.. లక్ష్మీదేవిపల్లిలోని సుగుణ కంపెనీలో కార్మికులుగా పనిచేస్తున్నారు.
వీరికి 8 ఏండ్ల పాప ఉంది. శనివారం మధ్యాహ్నం ఇంటి ఆవరణలో ఆడుకుంటూ వెళ్లి నీటి బకెట్లో పడింది. ఊపిరాడక మృతిచెందింది. కొద్దిసేపటి తర్వాత గుర్తించిన తల్లిదండ్రులు స్థానిక హాస్పిటల్కు తరలించగా, అప్పటికే పాప చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.