నీటి బకెట్​లో పడి..8 ఏండ్ల పాప మృతి

నీటి బకెట్​లో పడి..8 ఏండ్ల పాప మృతి

పరిగి, వెలుగు: ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారి నీటి బకెట్ లో పడి మృతి చెందింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పరిగిలో జరిగింది. బిహార్ కు భార్యాభర్తలు పరిగిలోని టీచర్స్​కాలనీలో ఉంటూ.. లక్ష్మీదేవిపల్లిలోని సుగుణ కంపెనీలో కార్మికులుగా పనిచేస్తున్నారు.

 వీరికి 8 ఏండ్ల పాప ఉంది. శనివారం మధ్యాహ్నం ఇంటి ఆవరణలో ఆడుకుంటూ వెళ్లి నీటి బకెట్లో పడింది. ఊపిరాడక మృతిచెందింది. కొద్దిసేపటి తర్వాత గుర్తించిన తల్లిదండ్రులు స్థానిక హాస్పిటల్​కు తరలించగా, అప్పటికే పాప చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.