
ముషీరాబాద్, వెలుగు: చిక్కడపల్లి వేంకటేశ్వర స్వామి దేవాలయానికి చెందిన 1,576 గజాల భూమి కబ్జాకు గురైందని సామాజిక కార్యకర్తలు గొర్ల చంద్రశేఖర్, పాత శివకుమార్ ఆరోపించారు. ఈ విషయాన్ని మంత్రి కొండా సురేఖ, ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. తమ ఫిర్యాదు మేరకు మంత్రి కొండా సురేఖ నివేదిక ఇవ్వాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారని, కానీ వారు బేఖాతరు చేస్తూ కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపివంచారు. ఇప్పటికైనా వారిపై చర్యలు తీసుకోని ఆలయ భూములను రక్షించాలని, లేదంటే పోరాటాలు చేస్తామని డిమాండ్ చేశారు.