భూసేకరణ అంతా అయ్యాక ధరలు పెంచుతున్నారు

భూసేకరణ అంతా అయ్యాక ధరలు పెంచుతున్నారు
  • దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు 

హైదరాబాద్: రైతుల దగ్గర నుంచి భూసేకరణ అంతా పూర్తయ్యాక ధరలు పెంచుతున్నారని దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చినప్పటినుంచి రెండేళ్ల కోసారి భూముల ప్రభుత్వ రేట్ల సవరణ చేసి వుంటే వివిధ ప్రాజెక్ట్ ల కింద భూములు కోల్పోయిన రైతులకు ఎక్కువ డబ్బులు వచ్చేవని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు భూ సేకరణ అంతా అయ్యాక ధరలు పెంచుతున్నారని.. ఇప్పటికైనా ఆ క్లాజ్ పెట్టాలని రఘునందన్ కోరారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ వ్యాఖ్యలపై మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పందించారు. ఆయన సూచనలను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు.