ట్రిపుల్​ఐటీ చరిత్రలో నిఖిల్కు భారీ ప్యాకేజీ

 ట్రిపుల్​ఐటీ చరిత్రలో నిఖిల్కు భారీ ప్యాకేజీ

భైంసా, వెలుగు: బాసర ట్రిపుల్​ ఐటీ కంప్యూటర్​సైన్స్ ​స్టూడెంట్స్​ నిఖిల్​కు మల్టినేషనల్​ కంపెనీ అమెజాన్​లో రూ. 65 లక్షల ప్యాకేజీతో జాబ్​ లభించింది. ఇటీవలే నిఖిల్​ కంప్యూటర్​సైన్స్​లో డిగ్రీ పూర్తి చేశాడు. ట్రిపుల్​ఐటీ చరిత్రలో అత్యధిక ప్యాకేజీతో జాబ్​సంపాదించిన నిఖిల్​ను ఆర్జీయూకేటీ ఇన్​చార్జీ వీసీ వెంకటరమణ, డైరెక్టర్​ సతీశ్​కుమార్ ​అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తున్న వనరులను ఉపయోగించుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఈ సందర్భంగా వారు స్టూడెంట్స్​కు సూచించారు.