భైంసా, వెలుగు: బాసర ట్రిపుల్ ఐటీ కంప్యూటర్సైన్స్ స్టూడెంట్స్ నిఖిల్కు మల్టినేషనల్ కంపెనీ అమెజాన్లో రూ. 65 లక్షల ప్యాకేజీతో జాబ్ లభించింది. ఇటీవలే నిఖిల్ కంప్యూటర్సైన్స్లో డిగ్రీ పూర్తి చేశాడు. ట్రిపుల్ఐటీ చరిత్రలో అత్యధిక ప్యాకేజీతో జాబ్సంపాదించిన నిఖిల్ను ఆర్జీయూకేటీ ఇన్చార్జీ వీసీ వెంకటరమణ, డైరెక్టర్ సతీశ్కుమార్ అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తున్న వనరులను ఉపయోగించుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఈ సందర్భంగా వారు స్టూడెంట్స్కు సూచించారు.