ఖరీదైన వాచ్లు సేకరించడంలో అనంత్ అంబానీ స్టైలే వేరు. కొత్తగా ఆయన ధరించిన ఒక అరుదైన వాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఇది కేవలం టైం చూపే వాచ్ మాత్రమే కాదు, అద్భుతమైన కళాఖండం.
ఈ వాచ్ ప్రత్యేకతలు ఏంటంటే... ఈ వాచ్ మధ్యలో పరమశివుని చిన్న విగ్రహం చాలా అందంగా చెక్కబడి ఉంటుంది. అంతేకాకుండా, దీనిపై 'ఓం' అనే గుర్తు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆధ్యాత్మికతను, ఆధునిక టెక్నాలజీని కలిపి దీనిని తయారు చేశారు.
ఈ వాచ్ మెరుపు మామూలుగా ఉండదు. దీని కేస్పైనే 300కు పైగా బాగెట్-కట్ వజ్రాలను పొదిగారు. దీని బాడీని '18 క్యారెట్ల రోజ్ గోల్డ్'తో తయారు చేశారు.
ఈ వాచ్లో ఒక చిన్న మ్యూజిక్ బాక్స్ కూడా ఉంటుంది. అది మనకు కావలసినప్పుడు ఒక ప్రత్యేకమైన ట్యూన్ను వినిపిస్తుంది. ఈ వాచ్లో 658 భాగాలతో కూడిన అత్యంత కాంప్లెక్ మెకానిజం ఉంది. ఇందులో వాచ్ తయారీలో అత్యంత అధునాతన ఫీచర్లలో ఒకటైన ఫ్లయింగ్ ట్రిపుల్-యాక్సిస్ టోర్బిలాన్ కూడా ఉంది.
దీని విలువ సుమారు 10 నుండి 12 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన 'జాకబ్ & కో' అనే లగ్జరీ బ్రాండ్ దీనిని అనంత్ అంబానీ కోసం ప్రత్యేకంగా రూపొందించింది. భారతదేశంలో ఇప్పటివరకు కనిపించిన అత్యంత ఖరీదైన, అరుదైన వాచ్లలో ఇది ఒకటిగా నిలుస్తుంది.

