హిమాచల్ ప్రదేశ్ లో ఆకస్మిక వరదలు సంభవించాయి.ఈ వరదలకు కులు, లాహౌల్-స్పితి జిల్లాల్లో ఐదు మంది మృతి చెందగా ముగ్గురికి గాయాలయ్యాయి. 11 మంది తప్పిపోయారని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది. కూలీలు ఉంటున్న రెండు టెంట్లు, JCB వరదల్లో కొట్టుకు పోయాయి. ఈ ఘటనలో ఒకరు చనిపోగా..మరో పది మంది గల్లంతయ్యారు. లాహౌల్-స్పీతి జిల్లాలో రాత్రి 8 గంటల టైంలో ఈ ఘటన జరిగింది. భారీ వర్షాల కారణంగా వరద పొటేత్తిందని స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ డైరెక్టర్ సుదేశ్ కుమార్ చెప్పారు. సమాచారం అందుకున్న విపత్తు నిర్వహణ,ఐటీబీపీ బృందాలు రంగంలోకి దిగి సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి. నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండడంతో రాత్రి సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. షిమ్లా జిల్లా వికాస్ నగర్-పంతఘాటి రోడ్డులో కొండ చరియలు విరిగిపడ్డాయి. అక్కడ పార్కు చేసి ఉంచిన కారు పూర్తిగా ధ్వంసమైంది.
Himachal Pradesh | 5 deaths, 3 injuries and 11 persons missing following flash floods in Kullu and Lahaul-Spiti districts of the state, says State Disaster Management Authority
— ANI (@ANI) July 28, 2021