
యాదాద్రి, వెలుగు: సాగు నీటి కాల్వల పనులు, రిపేర్ల కోసం ఫండ్స్కేటాయించాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్లోని జలసౌధలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. నియోజకవర్గంలోని బీబీనగర్, వలిగొండ, పోచంపల్లి, భువనగిరి మండలాల్లోని బొల్లేపల్లి, భీమలింగం, అలీనగర్కాల్వల రిపేర్లకు రూ.30 కోట్లు కేటాయించాలని కోరారు.
చిన్నేరు వాగుపై ఉన్న మాదారం, వడపర్తి, అనాజీపురం, బొల్లేపల్లి వద్ద చెక్ డ్యాంల నిర్మాణం కోసం రూ.25 కోట్లు మంజూరు చేయాలని విన్నవించారు. మూసీ ఫీడర్కాల్వల్లోని గుర్రపు డెక్కను తొలగించి, కాల్వల నిర్వహణకు రూ.1.20 కోట్లు కేటాయించాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.