కాల్వల పనులకు ఫండ్స్ కేటాయించండి : ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి

కాల్వల పనులకు ఫండ్స్ కేటాయించండి : ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి

యాదాద్రి, వెలుగు: సాగు నీటి కాల్వల పనులు, రిపేర్ల కోసం ఫండ్స్​కేటాయించాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్​లోని జలసౌధలో మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. నియోజకవర్గంలోని బీబీనగర్, వలిగొండ, పోచంపల్లి, భువనగిరి మండలాల్లోని బొల్లేపల్లి, భీమలింగం, అలీనగర్​కాల్వల రిపేర్లకు రూ.30 కోట్లు కేటాయించాలని కోరారు. 

చిన్నేరు వాగుపై ఉన్న మాదారం, వడపర్తి, అనాజీపురం, బొల్లేపల్లి వద్ద చెక్ డ్యాంల నిర్మాణం కోసం రూ.25 కోట్లు మంజూరు చేయాలని విన్నవించారు. మూసీ ఫీడర్​కాల్వల్లోని గుర్రపు డెక్కను తొలగించి, కాల్వల నిర్వహణకు రూ.1.20 కోట్లు కేటాయించాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.