భారత్ జవాబుదారీగా ఉండాలె: బ్లింకెన్

భారత్ జవాబుదారీగా ఉండాలె: బ్లింకెన్

కెనడాలో ఖలిస్తాన్ టెర్రరిస్ట్ నిజ్జర్ హత్య కేసు విషయంలో భారత్ జవాబుదారీతనంతో సహకరించాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ అన్నారు. శుక్రవారం న్యూయార్క్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. భారత్ పై కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలపై తాము తీవ్రంగా ఆందోళన చెందుతున్నామన్నారు. ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగేలా భారత్ సహకరించాలని కోరారు.