కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నిందలు వేశారు : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నిందలు వేశారు : ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
  • బనకచర్ల అంశంలో వారివి కేవలం రాజకీయ ఆరోపణలు: ఎంపీ వద్దిరాజు రవిచంద్ర

హైదరాబాద్, వెలుగు: బనకచర్ల ప్రాజెక్టు విషయంలో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ పార్టీ సలహాలు, సూచనలను ప్రభుత్వం ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోలేదని, కేవలం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నిందలు వేశారని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు. ప్రాజెక్టును రద్దు చేయించేందుకు బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ తరఫున మద్దతివ్వడానికి వెళ్తే రాజకీయ ఆరోపణలు చేశారని మండిపడ్డారు. బుధవారం సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం అనంతరం మీడియాతో ఆయన మాట్లాడా రు. ‘‘ఏపీ విభజన చట్టం ప్రకారం ఏదైనా ఒక రాష్ట్రం కొత్త ప్రాజెక్టును చేపడితే అపెక్స్ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌లో ప్రాజెక్టు వివరాలను పెట్టి చర్చించి, అనుమతి తీసుకోవాల్సి ఉం టుంది. 

గతంలో ఏపీ ప్రభుత్వం ఇదే కారణం చూపించి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, తుమ్మిళ్ల, భక్త రామదాసు, డిండి వంటి ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ కేంద్రానికి, జలశక్తి శాఖకు కృష్ణా, గోదావరి బోర్డులకు ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తూ అపెక్స్ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌లో చర్చించకుండా పోలవరం, బనకచర్ల ప్రాజె క్టుల విషయాల్లో దూకుడుగా వ్యవహరిస్తోంది. దీనిపై అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చించేలా కేంద్రాన్ని కోరాలని సీఎంకు విజ్ఞప్తి చేశాం. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి పోలవరం బనకచర్ల ప్రాజెక్టు నిలిపివేయాలని ఏకవాక్య తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలి. బనకచర్లపై సుప్రీంకోర్టులో పోరాటం చేయాలి’’అని ఆయన పేర్కొన్నారు.