యాదాద్రి అభివృద్ధికి రూ. 8.47 కోట్లు : బూర నర్సయ్య గౌడ్

 యాదాద్రి అభివృద్ధికి రూ. 8.47 కోట్లు : బూర నర్సయ్య గౌడ్

యాదాద్రి, వెలుగు : అభివృద్ధి పనుల కోసం కేంద్రం ఫండ్స్​ రిలీజ్ చేస్తోందని మాజీ ఎంపీ, బీజేపీ లీడర్​ బూర నర్సయ్య గౌడ్​ తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరు అశోక్​ గౌడ్​తో కలిసి మంగళవారం భువనగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉపాధి హామీ స్కీమ్​ కింద యాదాద్రి జిల్లాలో 63 అభివృద్ధి పనుల కోసం 2025-–26 ఫైనాన్షియల్​ ఇయర్​లో రూ. 8.47 కోట్లు రిలీజ్ చేసిందని చెప్పారు.

ఇందులో ఆలేరు, మునుగోడు, నకిరేకల్ నియోజవర్గాల్లోని 10 గ్రామ పంచాయతీ బిల్డింగ్​ల కోసం రూ.2 కోట్లు, 26 అంగన్​వాడీ బిల్డింగ్​ల కోసం రూ.3.12 కోట్లు, స్కూల్ ప్రహరీల నిర్మాణం కోసం రూ.3.35 కోట్లు కేటాయించిందని తెలిపారు. జిల్లా అభివృద్ధి కోసం ఫండ్స్​రిలీజ్​ చేసిన కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.