
యాదాద్రి, వెలుగు : అభివృద్ధి పనుల కోసం కేంద్రం ఫండ్స్ రిలీజ్ చేస్తోందని మాజీ ఎంపీ, బీజేపీ లీడర్ బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరు అశోక్ గౌడ్తో కలిసి మంగళవారం భువనగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉపాధి హామీ స్కీమ్ కింద యాదాద్రి జిల్లాలో 63 అభివృద్ధి పనుల కోసం 2025-–26 ఫైనాన్షియల్ ఇయర్లో రూ. 8.47 కోట్లు రిలీజ్ చేసిందని చెప్పారు.
ఇందులో ఆలేరు, మునుగోడు, నకిరేకల్ నియోజవర్గాల్లోని 10 గ్రామ పంచాయతీ బిల్డింగ్ల కోసం రూ.2 కోట్లు, 26 అంగన్వాడీ బిల్డింగ్ల కోసం రూ.3.12 కోట్లు, స్కూల్ ప్రహరీల నిర్మాణం కోసం రూ.3.35 కోట్లు కేటాయించిందని తెలిపారు. జిల్లా అభివృద్ధి కోసం ఫండ్స్రిలీజ్ చేసిన కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.