- వృద్ధురాలి మెడలోని పుస్తెల తాడు చోరీ
పద్మారావునగర్, వెలుగు: ఓ రైల్వే ఉద్యోగి చైన్ స్నాచింగ్ కు పాల్పడిన ఘటన హైదరాబాద్ పద్మారావునగర్ లోని వెంకటాపురం కా లనీలో చోటుచేసుకుంది. ఈ నెల16న ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిలకలగూడ పోలీసుల ప్రకారం ..వెంకటపురం కాలనీకి చెందిన 73 ఏండ్ల వృ ద్ధురాలు ఈ నెల16న ఇంటి వద్ద వాకింగ్ చేస్తున్నది. అటుగా వచ్చిన ఓ యువకుడు (25) ఇల్లు రెంట్కు కావాలని అడిగాడు. వృద్ధురాలిని మాటల్లో పెట్టి సడెన్గా ఆమె మెడ లోంచి 4 తులాల బంగారు చైన్ లాక్కొని పారిపోయాడు. వృద్ధురాలిచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
బాధితురాలి ఇంటి వద్దనున్న సీసీ కెమెరాలను పరిశీలిం చారు. అందులో రికార్డయిన వీడియో ఆధారంగా..చైన్ స్నాచింగ్ కు పాల్పడిన వ్యక్తి రైల్వే ఎంప్లాయ్ వనిపెంట హర్షవర్ధన్రెడ్డి అని తేలింది. నిందితుడిని బుధవారం అరెస్ట్ చేసి న పోలీసులు.. అతని నుంచి చైన్ రికవరీ చేశా రు. అనంతరం హర్షవర్ధన్రెడ్డిని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.