ఉత్తరప్రదేశ్లోని అయోధ్య(Ayodhya)లో నిర్మిస్తోన్న రామ మందిరం(Ram Mandir) ప్రారంభోత్సవానికి ముహుర్తం తేదీ ఖరారైంది. దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి 2024, జనవరి 22న ఆలయాన్ని ప్రారంభించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. ఇప్పటికే రామమందిరం ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆహ్వానం అందిన విషయం తెలిసిందే.
ఈ వేడుక కోసం దేశంలో భిన్న కళ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానించడానికి కమిటీ నిర్ణయించుకున్నట్టు సమాచారం. అందులో భాగంగా బాలీవుడ్ నుంచి స్టార్ హీరో రణబీర్ కపూర్ దంపతులతో పాటు అక్షయ్ కుమార్ లను..టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవీతో పాటు ప్రభాస్ను సైతం రామ మందిరం వేడుకకు ఆహ్వానించినట్లు పింక్విల్లా ఒక రిపోర్టులో తెలిపింది.
అలాగే ఈ వేడుకకు మరికొంతమందికి బాలీవుడ్ నుంచి ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. వారిలో సన్నీ డియోల్, అజయ్ దేవ్గన్, ఆయుష్మాన్ ఖురానా, యష్ లు కూడా ఈ ఈవెంట్కు హాజరుకానున్నారు.
అదే విధంగా డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ, రోహిత్ శెట్టి, రాజ్కుమార్ హిరానీ సహా ఇంకా చాలా మందిని ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కంగనా రనౌత్ రామజన్మభూమి దర్శనం కోసం అయోధ్యలోని రామమందిరాన్ని సందర్శించి పలు విశేషాలు పంచుకున్న విషయం తెలిసిందే. 2020 ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలో రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. జనవరి 16న వేడుకలు మొదలై.. అదే నెల 22న ముగియనున్నాయి.