మహాత్మగాంధీకి సీఎం కేసీఆర్ నివాళి

మహాత్మగాంధీకి సీఎం కేసీఆర్ నివాళి

శాంతి, సహనాలను ప్రదర్శిస్తూ ఎన్ని కష్టాలెదురైనా, ప్రజాస్వామిక పద్దతుల్లో ఉన్నతమైన లక్ష్యాలను సాధించిన జాతిపిత మహాత్మా గాంధీ కార్యాచరణ ఆదర్శనీయమని సీఎం కేసీఆర్ అన్నారు. మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా సీఎం ఆయనకు నివాళి అర్పించారు. సత్యం, అహింసా మార్గాలే ఆయుధంగా దేశానికి స్వాతంత్ర్యం సాధించిన మహాత్ముడి స్ఫూర్తి గొప్పదన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించడంలో గాంధీజీ అనుసరించిన శాంతియుత విధానాలు ఇమిడి వున్నాయని సీఎం తెలిపారు. గాంధీజీ అనుసరించిన శాంతి, సౌభ్రాతృత్వం, లౌకిక విధానాన్ని అవలంబిస్తూ నూతన తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో సాగుతున్నదని సీఎం అన్నారు.

మహత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ బాపూఘాట్ లో నివాళుల  అర్పించారు పలువురు ప్రముఖులు. సీఎస్ సోమేశ్ కుమార్, హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీ కేశవరావు, ఎమ్మెల్యేలు, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ నివాళులు అర్పించారు. గాంధీ స్మారక స్థూపం దగ్గర పుష్పగుచ్చాలు ఉంచి శ్రద్ధాంజలి అర్పించారు. శాసనసభ ఆవరణలోని గాంధీ విగ్రహానికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. శాసనమండలి ప్రొటెం చైర్మన్ హసన్ జాఫ్రి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, విప్ ఇన్ కౌన్సిల్ ప్రభాకర్ రావు, లేజిస్లేటివ్ సెక్రటరీ డా. వి. నరసింహా చార్యులు గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు.