ఐజ్వాల్: మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్(ఎంఎన్ఎఫ్)ఈసారి కూడా అధికారంలోకి వస్తుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జోరంతంగా తెలిపారు. గతంలో వచ్చిన సీట్ల కంటే ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఐజ్వాల్ఈస్ట్1 అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్పత్రాలు దాఖలు చేసిన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో తమ ప్రధాన ప్రత్యర్థి జోరామ్ పీపుల్స్ మూవ్మెంట్(జెడ్పీఎం) పార్టేనని తెలిపారు. గతంలో రాహుల్ గాంధీ ఆరోపించినట్లుగా ఆర్ఎస్ఎస్తో తమకు ఎలాంటి సంబంధాలు లేవని తేల్చి చెప్పారు. ఎంఎన్ఎఫ్ కేంద్రంలోని ఎన్డీయేతో కలిసి వెళ్తుందన్నారు. 40 అసెంబ్లీ స్థానాలు ఉన్న మిజోరంలో గత ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్38% ఓట్లతో 26 సీట్లు గెలుచుకుంది. వరుసగా నాలుగోసారి సీఎం పీఠం ఎక్కాలని జోరంతంగా చూస్తున్నారు. కాగా ఇక్కడ నవంబర్ 7న ఎన్నికలు జరగనున్నాయి.