
నకిరేకల్, వెలుగు : ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు, వైద్య సిబ్బంది అందుబాటులో లేకుంటే చర్యలు తప్పవని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. మంగళవారం నకిరేకల్ ప్రాంతీయ ఆస్పత్రిని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శోభారాణి అందుబాటులో లేకపోవడం, పలు గదులకు తాళాలు వేసి ఉండడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ డాక్టర్లు, వైద్య సిబ్బంది 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.
ఎమర్జెన్సీ కేసులు వచ్చినప్పుడు వెంటనే వైద్యం అందించాలని చెప్పారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అనంతరం రికార్డులను పరిశీలించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట నల్గొండ ఆర్డీవో వై.అశోక్ రెడ్డి, తహసీల్దార్ జమీరుద్దీన్ తదితరులు ఉన్నారు.