ఎంపీ మల్లు రవిపై అలంపూర్ నేతల ఫిర్యాదు

ఎంపీ మల్లు రవిపై అలంపూర్ నేతల ఫిర్యాదు
  • కమీషన్లు తీసుకొని బీఆర్ ఎస్ నేతల బిల్స్ క్లియర్ చేయిస్తున్నారని ఆరోపణ

హైదరాబాద్, వెలుగు: ఎంపీ మల్లు రవిపై అలంపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు ఏఐసీసీ ఇన్​చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్  గౌడ్​కు ఫిర్యాదు చేశారు. గురువారం గాంధీ భవన్ లో నేతలను కలిసి వినతిపత్రం అందజేశారు. 

సీఎంకు రాసిన లేఖను మీనాక్షికి అందజేశారు. ఇటీవల నాగర్ కర్నూల్​ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు అలంపూర్ బీఆర్​ఎస్ ఎమ్మెల్యే విజేయుడు తన ఇంటికి పిలిపించుకున్నారని, తేనేటి విందు ఇచ్చారని, ఈ అంశంలో పార్టీ లైన్ దాటారని నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. కమీషన్లు తీసుకొని బీఆర్ ఎస్ నేతల పెండింగ్ బిల్స్ రిలీజ్ చేయిస్తున్నారని, కాంగ్రెస్ నేతల బిల్స్ రిలీజ్ కావడం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ మల్లు రవితోపాటు గద్వాల ఇన్​చార్జ్​ సరిత తిరుపతయ్య, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డిపై కూడా ఫిర్యాదు చేశారు.