నేటితో ముగియనున్న దోస్త్ రెండో విడత అడ్మిషన్లు

నేటితో ముగియనున్న దోస్త్ రెండో విడత అడ్మిషన్లు

నల్గొండ, వెలుగు : డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ రెండో విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటితో ముగియనుంది. రెండో విడత అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ గత నెల 30 నుంచి జూన్ 8వ వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు జూన్ 9 వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునే అవకాశం ఉంది. రెండో విడత అడ్మిషన్ల జాబితా జూన్ 13న వెలువబడుతుంది. రెండో విడత అడ్మిషన్ ప్రక్రియలో సీట్లు పొందిన విద్యార్థులు వారికి కేటాయించిన కళాశాలల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ జూన్ 19లోపు తప్పకుండా చేసుకోవాలి. లేదంటే సీటు కోల్పోయే అవకాశం ఉంది.

కళాశాలలో కోర్సులు.. 

ప్రభుత్వ మహిళా డిగ్రీ( అటానమస్)కళాశాలలో  కొత్త కోర్సులను ఈ ఏడాది నుంచి ప్రవేశపెట్టనున్నట్లు ఆ కళాశాల దోస్త్ కో–ఆర్డినేటర్ డాక్టర్ సుంకరి రాజారామ్  తెలిపారు. బీఎస్సీ ఆనర్స్, కంప్యూటర్ సైన్స్, లైఫ్ సైన్సెస్ విభాగంలో బీజెడ్సీ కంప్యూటర్ సైన్స్, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, బీకాం కంప్యూటర్ సైన్స్, బీఏ తెలుగు, ఇంగ్లిష్ మీడియం కాకుండా అప్రెంటిస్ షిప్ డిగ్రీ ప్రోగ్రాం బీకాం విభాగంలో బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ కోర్సు, బీఏ విభాగంలో కాంటెంట్ అండ్ క్రియేటివ్ రైటింగ్ కొత్త కోర్సులను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు.