మాజీ వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ సాంబయ్య ఆరోగ్య పరిస్థితి విషమం

మాజీ వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ సాంబయ్య ఆరోగ్య పరిస్థితి విషమం

హైదరాబాద్: సీఎం కేసీఆర్ మిత్రుడు, తెలంగాణ విశ్వ విద్యాలయం మాజీ వైస్ చాన్స్ లర్ ప్రొఫెసర్ పసుల సాంబయ్య ఆరోగ్య పరిస్థితి విషమం ఉందని తెలిపారు ఆయన కుటుంబ సభ్యులు. వారం రోజుల క్రితం కోవిడ్ పాజిటివ్ రావడంతో హన్మకొండ మాక్స్ కేర్ హాస్పిటల్ లో చేర్చామని.. అనారోగ్యం క్షీణించడంతో.. ఇప్పుడు వెంటిలేటర్ పై ట్రీట్ మెంట్ అందిస్తున్నారని చెప్పారు. అయితే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించాలని డాక్టర్లు చెప్పారని తెలిపారు. దీంతో సాంబయ్య మిత్రులు, కుటుంబ సభ్యులు హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్స్ లో చేర్పించేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికి  ఫలితం లేకుండా పోయింది. బెడ్ లు ఖాళీగా లేవంటూ కార్పొరేట్ హాస్పిటల్స్ చేతులెత్తేశాయని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు చొరవ తీసుకుని మెరుగైన వైద్యం అందించి ప్రొఫెసర్ సాంబయ్యని కాపాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు కుటుంబ సభ్యులు.