న్యూఢిల్లీ డిక్లరేషన్ కు గ్రీన్ సిగ్నల్..

న్యూఢిల్లీ డిక్లరేషన్ కు గ్రీన్ సిగ్నల్..

 న్యూ ఢిల్లీ డిక్లరేషన్ కు సభ్యదేశాలు మొత్తం ఏకతాటిపైకి వచ్చాయని ప్రదాని మోడీ ప్రకటించారు. డిక్లరేషన్ కోసం శ్రమించిన మంత్రులు, షెర్పాలు,అధికారులను ప్రధాని అభినందించారు.అభివృద్ధి చెందిన దేశాలతో ఎన్నో కీలక అంశాలను ఈ డాక్యుమెంట్ లో పొందుపరిచారు. అస్థిరమైన ప్రజాస్వామ్యాం ఉన్న దేశాలనూ గ్లోబల్ సౌత్ గానే పిలుస్తారు. ఇలా తక్కవ ఆదాయం  గల దేశాల గొంతుక అయ్యే  విధంగా న్యూ ఢిల్లీ డిక్లరేషన్ భారత్ తయారు చేసింది.

ALSO READ : జీ20 కోసం మురికి వాడలు దాచిపెట్టారు: రాహుల్ గాంధీ

ఐదు అంశాలపై ఏకాభిప్రాయం

1. బలమైన,స్థిరమైన,సమతుల్యమైన సమగ్రాభివృద్ధి
2. వేగవంతమైన సుస్థిరాభివృద్ధి
3. సుస్థిర భవిష్యత్ కోసం హరిత అభివృద్ధి ఒప్పందం
4. 21వ శతాబ్దానికి బహుపాక్షిక సంస్థలు
5.బహుపాక్షికతను పునరుద్దరించడం