లాయర్ దుస్తుల్లో కోర్టుకు వచ్చి.. గ్యాంగ్ స్టర్ ను కాల్చి చంపారు

 లాయర్ దుస్తుల్లో  కోర్టుకు వచ్చి.. గ్యాంగ్ స్టర్ ను కాల్చి చంపారు

ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నో సివిల్ కోర్టు వెలుపల గ్యాంగ్ స్టర్, ముఖ్తార్ అన్సారీ సన్నిహితుడు సంజీవ్ జీవాపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో అతను ప్రాణాలు కోల్పోయాడు. అతనిపై కాల్పులు జరిపిన దుండగుడు లాయర్ వేషంలో ఉన్నట్టు సమాచారం.

బీజేపీ నేత బ్రహ్మదత్ ద్వివేది హత్య కేసులో నిందింతుడిగా ఉన్న జివాను విచారణ నిమిత్తం పోలీసులు లక్నో కోర్టుకు తీసుకువచ్చారు. ఈ సమయంలోనే ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ఓ యువతి కూడా గాయపడింది. కాగా ఈ గ్యాంగ్ స్టర్ పై గతంలో పలు క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. రాష్ట్ర పోలీసుల కస్టడీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ కాల్చి చంపబడిన రెండు నెలల తర్వాత ఈ ఘటన జరగడం పలు ఆందోళనలకు దారి తీస్తోంది.

దుండగులు లాయర్ల వేషంలో వచ్చి జివాపై కాల్పులు జరిపారని, ఆ బుల్లెట్లు తాకి అతను చనిపోయినట్టు పలు నివేదికలు సూచిస్తున్నాయి. ఆ తర్వాత దుండగుడు అక్కడ్నుంచి పారిపోయినట్టు సమాచారం. పోలీసులు ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. హత్యకు గల కారణాలు, ఎవరు, ఎందుకు చేశారన్న వివరాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు.

సంజీవ్ జివా ఎవరు..?

  • అతను కాంపౌండర్ గా కెరీర్ గా ప్రారంభించాడు. ఆపై అండర్ వరల్డ్ లో సభ్యుడిగా మారాడు.
  • 2018లో బాగ్ పత్ జైలులో కాల్చి చంపబడిన మున్నా బజరంగీకి జివా సన్నిహితుడు.
  • బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ హత్యలో ముఖ్తార్ అన్సారీతో పాటు సంజీవ్ మహేశ్వరి జివా కూడా నిందితుడిగా ఉన్నారు.

https://twitter.com/ANINewsUP/status/1666400690233827328