కేసీఆర్ ఎప్పుడైనా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారా?

కేసీఆర్ ఎప్పుడైనా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారా?

హైదరాబాద్ : దళిత బంధు పేరుతో  సీఎం కేసీఆర్ దళితులను మోసం చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి. శనివారం ఆమె గాంధీభవన్ లో మాట్లాడుతూ.. దళితులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు. ఏడేళ్లుగా ఎస్సీ-ఎస్టీ సబ్ ప్లాన్ కోసం 87 వేల కోట్లు కేటాయించి 47 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆరోపించారు. 38 వేల కోట్లు ఎటు పోయాయో చెప్పాలన్నారు. మూడెకరాల భూమి పథకానికి 3 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే...6 వేల 662 కుటుంబాలకు 16 వేల ఎకరాలు మాత్రమే పంపిణీ  చేశారన్నారు గీతారెడ్డి. సీఎం కేసీఆర్ ఎప్పుడైనా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారా అని ప్రశ్రించిన గీతారెడ్డి..దళితబంధు పథకం అమలుకు మాకు అభ్యంతరం లేదు కానీ.. రాష్ట్రం అంతటా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఎన్నికల కోసమే హుజురాబాద్ లో దళితబంధు ఫైలెట్ ప్రాజెక్టు అమలు అని కేసీఆర్ స్వయంగా ఒప్పుకున్నారన్నారు. 125 ఫీట్ అంబేద్కర్ విగ్రహం చైనాలో తయారు అవుతుందా లేదా చెప్పాలని..హుజురాబాద్ లో దళితులు టీఆరెస్ కు ఓట్లు వెయ్యకపోతే రాష్ట్రం అంతటా అమలు చేయమని దళితుల్ని కేసీఆర్ బెదిరిస్తున్నారన్నారు.