
- హైకోర్టు ఆదేశాలతో న్యూ బోయిగూడలో చర్యలు
పద్మారావు నగర్, వెలుగు: సికింద్రాబాద్ న్యూ బోయిగూడలోని మెట్రో పిల్లర్ 1006 మలుపు వద్ద మెట్రో రైలు సౌండ్ పొల్యూషన్తో స్థానికులకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ఎంఎన్కే విట్టల్ సెంట్రల్ కోర్టు సంక్షేమ సంఘం అధ్యక్షుడు డాక్టర్ జి. హనుమాన్లు ఇటీవల హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీంతో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తున్న సమయంలో సౌండ్ లెవెల్స్ రికార్డు చేసి, రిపోర్టును సమర్పించాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు హైకోర్టు ఆదేశించింది.
ఈ క్రమంలో ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ విద్యుల్లత, హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ప్రతినిధి శివకుమార్, ఎంఎన్ కే అపార్టుమెంట్ వాసుల సమక్షంలో పిల్లర్ నంబర్ 1006 వద్ద సౌండ్ లెవెల్స్ రికార్డు చేశారు. అత్యధికంగా 97 డెసిబెల్స్ సౌండ్ రికార్డు అయినట్లు తెలిసింది. మెట్రో రైలు సౌండ్పొల్యూషన్ను నియంత్రించేందుకు అధికార యంత్రాంగం ఉపక్రమించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.