
హుజూర్ నగర్,వెలుగు: ఆటో ఓనర్లు, డ్రైవర్లు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సీఐ చరమంద రాజు అన్నారు. బుధవారం హుజూర్ నగర్ లో ఐఎన్ టీయూసీ అనుబంధం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటోలకు పీసీ నంబర్లను అందజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఆటో నడిపేవారు ఖాకీ చొక్కా ధరించాల్సిందే అన్నారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ ప ట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జునరావు, ఐఎన్ టీయూసీ, ఆటో యూనియన్ నాయకులు బెల్లంకొండ గురవయ్య, చిట్యాల అమర్నాథ్ రెడ్డి, మేళ్లచెరువు ముక్కంటి, చింతకాయల రాము, పాశం రామరాజు, మద్యం నాగేందర్, కోలపుడి యోహాన్ తదితరులు పాల్గొన్నారు.