యాదగిరిగుట్టలో రెండో రోజు 'హైలెవల్' కమిటీ విచారణ

యాదగిరిగుట్టలో రెండో రోజు 'హైలెవల్' కమిటీ విచారణ

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఇటీవల జరిగిన 'చింతపండు' చోరీ ఘటనపై ఈవో వెంకటరావు నియమించిన 'హైలెవల్' కమిటీ విచారణ మంగళవారం కూడా సాగింది. మొదటి రోజు లేట్ నైట్ వరకు ఎంక్వైరీ చేసిన కమిటీ సభ్యులు.. రాత్రి యాదగిరిగుట్టలోనే బస చేసి మంగళవారం ఉదయమే తిరిగి విచారణ షురూ చేశారు. ప్రసాద తయారీ కేంద్రంలో పని చేస్తున్న ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగిని ప్రత్యేకంగా విచారించి సమాచారం సేకరించినట్లు తెలిసింది.