
పోలండ్ అధ్యక్ష ఎన్నికల్లో లిబరల్ నాయకుడు వార్సా మేయర్ రఫల్ ట్రస్కోవ్ స్కీపై కన్జర్వేటివ్ నేత కరోల్ నౌరోకీ విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో కరోల్ నౌరోకీ స్వల్ప ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో నౌరోకీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు ఇచ్చారు. కరోలో నౌరోకీకి 50.89 శాతం, లిబరల్ నాయకుడు ట్రస్కోవ్ స్కీ 49.11 శాతం ఓట్లు వచ్చాయి.